Publish Date:Oct 28, 2024
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయినా అనుక్షణం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అలర్ట్ గా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా స్పందిస్తున్నారు. ఆ కష్టాన్ని, నష్టాన్ని తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణ చెప్పాలంటే... ఇటీవల ఆర్టీసీ బస్ డ్రైవర్ ఒకతను దేవర సినిమాలోని దావుడి పాటకు డ్యాన్స్ చేశారు. అదేంటి డ్యాన్స్ చేయడానికీ లోకేష్ ప్రతి ఒక్కరి కష్టంలోనూ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారనడానికి సంబంధం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
ఆ డ్రైవర్ ఏదో తన ఇంట్లోనో లేకపోతే డ్యూటీ దిగిపోయిన తరువాతో ఈ డ్యాన్స్ చేయలేదు. బస్సును మార్గ మధ్యంలో నిలిపేసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన చేసిన ఆ డ్యాన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆయన ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించారని గానీ, బస్సు మధ్యలో ఆపేయడం వల్ల తమకు సమయం వృధా అయ్యిందని కానీ ఎటువంటి కంప్లయింట్లూ రాలేదు. అయినా విధి నిర్వహణలో నిర్లక్యంగా వ్యవహరించాడంటూ ఆ కండక్టర్ ను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే డ్రైవర్ ను ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేయడానికి ముందే లోకేష్ ‘సూపర్ డ్యాన్స్ బ్రదర్.. కీపిటప్, బస్సులో ప్రయాణీస్తున్న వారు కూడా ఎలాంటి ఫిర్యాదులూ చేయకుండా నీ డ్యాన్స్ ను నాలాగే యంజాయ్ చేసి ఉంటారు ’ అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పుడు విషయానికి వస్తే.. ఆ డ్రైవర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ట్వీట్ చేస్తూ ఓ నెటిజన్ లోకేష్ కు ట్యాగ్ చేస్తూ.. విధుల్లో క్రమశిక్షణ, సమయ పాలనా అత్యంత ముఖ్యమైనవే అయినా.. ఎవరికీ నష్టం కలిగించని ఈ చిన్న పాటి వినోదం అందించిన ఆ కండక్టర్ ను సస్పెండ్ చేయడం అన్యాయం అని పేర్కొని, అతడి సస్పెన్ష్ ఎత్తివేసేలా చూడాలి అని కోరారు. లోకేష్ వెంటనే స్పందించారు. ఆ నెటిజన్ కు వెంటనే బదులిస్తూ ఆ కండక్టర్ సస్పెన్షన్ వెనక్కు తీసుకుంటారు. ఆయన వెంటనే విధుల్లో చేరుతారు అని పేర్కొన్నారు. అంతే కాదు తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత కలుస్తానని ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు. లోకేష్ ఇమ్మీడియెట్ రెస్పాన్స్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-saves-driver-from-suspenssion-39-187539.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.