Publish Date:Jan 23, 2025
కర్నాటక సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడ) భూమి కేటాయింపు కేసులో సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతికి లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సిద్దరామయ్య దంపతులకు ఎలాంటి ప్రమోయం లేదని కుండబద్దలు కొట్టింది. ముడ భూమి కేటాయింపులో సిద్దరామయ్య దంపతుల ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాలూ, ఆధారాలూ లేవని లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న లోకాయుక్త, సిద్దరామయ్య దంపతులు మాత్రం ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పిందంటున్నారు. ముడ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు నివేదికలో పేర్కొనడంతో తప్పుచేసిన వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని లోకాయుక్త పేర్కొంది.
లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేశ్ నేతృత్వంలో కమిటీ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టింది. తుది నివేదికను న్యాయస్థానానికి సోమవారం (జనవరి 27)న సమర్పించనుంది. . 3.16 ఎకరాలలో ల్యాండ్ కన్వర్షన్ దశలన్నింటిని పరిశీలించిన లోకాయుక్త, ఈ స్థలంలో ముడా 14 సైట్లు పొందినట్లు నిర్ధారించింది. అధికారులే నిబంధనలు పాటించలేదని, సిద్దరామయ్య, ఆయన భార్య ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది.
అయితే ఈ స్కాంలో లోకాయుక్త సీఎం సిద్దరామయ్యకు క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రధాన ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా అధికారులు నిబం ధనలను ఉల్లంఘించలేరని వ్యాఖ్యానించిన ఆమె అధికార బలంతో సిద్దరామయ్య బయటపడ్డారని విమర్శించారు. తన పోరాటాన్ని ఇంతటితో ఆపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. సిద్దరామయ్య తన పలుకుబడి, అధికార బలంతో బయటపడ్డారని, అయితే తన పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokayukta-clean-chit-to-siddaramayya-39-191733.html
మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది.
ఎట్టకేలకు భారత్ యువసేన ఇంగ్లండ్ గడ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగురవేయగలిగింది. కారణం.. ఒకటి శుభ్ మన్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్.
మస్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒకరు అధ్యక్షులు కావాలంటే.. అందుకు ఫస్ట్ వారు జన్మతహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల పైబడి వయసుగల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మస్క్ కి లేవు. ఆయన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎన్జీ షెడ్ల వరకూ సాగింది.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది.
తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీశైలం జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుడు కన్నయ్య నాయుడు..
శ్రీశైలం జలాశయాన్ని రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు.
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.