Publish Date:Aug 26, 2025
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు.. అందుకు సంబంధించిన బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలన్నిటినీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత 15 నెలల వ్యవధిలోనే ఒక్కటొక్కటిగా అమలు చేసి ప్రజల హర్షామోదాలను పొందిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంలోనూ అనితర సాధ్యమైన చొరవను, ఆసక్తిని చూపిస్తున్నది.
ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఈ నెల 15 నుంచి అమలులోనికి వచ్చింది. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఇటువంటి పథకం అమలులో ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాలలోలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం అత్యంత పకడ్డందీగా, ప్రణాళికా బద్ధంగా మొదలైంది. రోజుల వ్యవధిలోనూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. మొదటి రోజు గుర్తింపు కార్డుల విషయంలో నెలకొన్న చిన్న గందరగోళం వినా ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. బస్సుల కొరత మాటే వినిపించలేదు. ఓవర్ లోడింగ్, కోట్లాటలు వంటివి కూడా పెద్దగా జరగలేదు.
ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు మందుకు వేసి ఉచిత బస్సుల లైవ్ ట్రాకింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉచిత బస్సు పథకంపై అధికారులతో సమీక్షలో భాగంగా ఆయనీ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సులన్నినీ టి లైవ్ ట్రాకింగ్ చేయాలనీ, ఇది మహిళల భద్రతకు దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు. అంతే కాదు.. లైవ్ ట్రాకింగ్ మహిళలు ఈ బస్సుల సమయాలను ట్రాక్ చేయడానికి అందుకు అనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది.
ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చిందంటే ఈ పథకం ప్రజాదరణ, ప్రజామోదం పొందిందనడానికి తార్కానంగా చెప్పుకోవచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ పథకం పై ప్రభుత్వానికి అందిన ఫీడ్ బ్యాక్ ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. వారి అవసరాల నిమిత్తం మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/live-tracking-of-women-free-travel-busses-39-205050.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.