న్యాయం కోసం సంతకాలు చేద్దామా!! 

Publish Date:Nov 27, 2021

Advertisement

ఈ ప్రపంచంలో ఏ విషయం ను అయినా రెండు కోణాల్లో చూస్తారు. ఒకటి న్యాయం, రెండోది అన్యాయం. ముఖ్యంగా భారదేశానికి చట్టాలు ఏర్పడ్డాక ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ ప్రతి వ్యవస్థలోనూ న్యాయాన్ని కాపాడటానికి న్యాయవ్యస్థను ఏర్పాటు చేసి, న్యాయం కోసం కృషి చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949 సంవత్సరం నవంబర్ 26 వ తేదీన తొలి ముసాయిదా కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. అదే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందించడం. అలా ముసాయిదా కమిటీ సంతకాలు చేసిన ఆరోజును జాతీయ న్యాయదినోత్సవంగా జరుపుకోవాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే నేటి నేషనల్ లా డే. 

న్యాయం ఎక్కడ!!

న్యాయం ఎక్కడుంటుంది అంటే కోర్ట్ లో మాత్రమే అనుకోవడం పొరపాటు. ఈ న్యాయ దినోత్సవం అర్థం న్యాయవాదులు న్యాయం రక్షించడం కోసం కృషి చేయడమే కావచ్చు కానీ నిజానికి ప్రస్తుతం న్యాయాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే తయారయ్యాయి. అందుకే ప్రతి ఒక్కరూ న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఏమిటంటే డబ్బు పెట్టి ఏది నమ్మిస్తే అదే న్యాయం అయిపోవడం. అంటే అన్యాయాన్ని కూడా డబ్బు పెట్టి న్యాయంగా మార్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు. 

మరేం చేద్దాం!!

న్యాయానికి నల్లకోటు ప్రామాణికం కాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. నిజానికి అందరికీ తెలుసు కూడా కానీ తెలియనట్టే ఉంటారు. ఈ సమాజంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో విషయాలు, అవకతవకలు మొదలైన వాటిని ఎవరి శక్తి మేరకు వాళ్ళు పరిష్కరిస్తూ, తమ ప్రమేయం ఉన్న ఏ విషయంలో అయినా నీతిగా ఉండటం అందరూ చేయదగిన పని.

న్యాయం కోసం!!

చాలామంది కొన్ని విషయాలు నేరుగా చూసి అందులో తమ పాత్ర ఉన్నా ఏదో నష్టం జరుగుతుందనో లేక మనకెందుకులే అనే ఆలోచనతోనో ఆ విషయాన్ని చూసి చూడనట్టు ఉంటారు. అది ఎంత తప్పో చాలామందికి అర్థం కాదు. తమ మాట వాళ్లకు ఎంత గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుందో అర్థం కాదు. ఎప్పుడో పాఠశాలల్లో చదువుకున్న ఐకమత్యం అనే విషయాన్ని జీవన సరళిలో ఎప్పుడో వదిలేసుకున్న మహానుభావులం మనం. ప్రతీది ఆర్థిక కోణంలో చూసే ఆర్థికశాస్త్ర విశ్లేషకులం. ఇంకా చేస్తున్న పనులను సమర్థించుకుంటూ వాటికి ఉదాహరణలు కూడా బయటకు చెప్పగల గొప్ప ప్రవచనాకారులం. ఇలాంటి మన మధ్య న్యాయం కావాలంటే అంత సులువుగా దొరుకుతుందా??

నమ్మకాల వంతెన!!

నిజానికి న్యాయానికి, నమ్మకానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. కానీ నమ్మకం ఉన్నచోట న్యాయానికి వెక్కిరింపు ఎదురవుతుంది కూడా. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ సహాయం చేసిన చోట ఇచ్చిన నమ్మకాన్ని, పొందిన సహాయాన్ని మరచి నమ్మకద్రోహం జరిగితే ఎవరూ న్యాయం కోసం ముందుకు రారు. ఉదాహరణకు ఈమధ్య కాలంలో కొందరు ఉద్యోగస్తులు లోన్ల విషయంలో ష్యురిటీ సంతకాలు పెట్టడానికి జంకుతున్నారు కారణం తీసుకున్నవారు  వాటిని కట్టడానికి వెనుకడుగు వేసి కట్టడం వదిలేస్తే సంతకాలు పెట్టిన సగటు వ్యక్తిని ఆ సంస్థ వారు కోర్ట్ ల చుట్టూ తిప్పి ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం. నమ్మకంతో సంతకాలు పెట్టిన సగటు వ్యక్తికి జీవితమే ప్రశ్నార్థకమైతే మరెక్కడ న్యాయం.కాబట్టి ఇలాంటి  విషయాలలో పూర్వపరాలు పరిశీలించి కోర్ట్ వారు ఇచ్చే తీర్పు సగటు న్యాయమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అందరిపైనా ఉంది.


◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.