ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 17 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమై నవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలోఅన్ని దారులూ రోమ్ వైపే అన్నట్లుగా అన్ని సర్వేల ఫలితాలూ తెలుగుదేశం కూటమినే సూచిస్తున్నాయి. తాజాగా మరో జాతీయ మీడియా సర్వేలో కూడా ఆంథ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. ఇండియా టుడే మూడ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం కూటమికి ఏకపక్ష విజయం ఖాయమని తేలినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి 17 నియోజకవర్గాలలో విజయం సాధిస్తుందనీ, జగన్ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుందని పేర్కొంది. ఇటువంటి ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలలోనూ వస్తాయని పేర్కొంది. అంటే తెలుగుదేశం కూటమి 119 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. తెలుగుదేశం 45శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక వైసీపీకి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని, బీజేపీ2 శాతం, కాంగ్రెస్ 3 శాతం ఓట్లు సాధిస్తాయని ఇండియాటుడే సర్వే పేర్కొంది. ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది.
ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. మిగిలిన స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉంటారు. వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తున్నది. పోటీ ప్రధానంగా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్యే ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ పార్టీ ఏంత మేర బలోపేతమైతే అంత మేరకు వైసీపీ నష్టపోతుందని సర్వే తేల్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ దే హవా!
ఇక తెలంగాణలోక్ సభ ఎన్నికలపై కూడా ఇండియా టుడే సీఓటర్ తన సర్వే ఫలితాన్ని వెలువరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ మూడు స్థానాలలో, బీఆర్ఎస్ మూడు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధిస్తుందనీ, బీఆర్ఎస్ కు కేవలం 21శాతం ఓట్లు మాత్రమే వస్తాయనీ సర్వే పేర్కొంది. బీజేపీక 29శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు, ఇతరులకు 6శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/landslide-victory-to-tdp-alliance-25-173211.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.