ఈగనై పోతానంటున్న కిషన్ రెడ్డి
Publish Date:Jul 30, 2012
Advertisement
ఎస్సీ, ఎస్టీ కమిషన్ వేసేంత వరకూ తాను ‘ఈగ’లా వెంటాడతానని బిజెపి రాష్ట్ర అథ్యక్షుడు కిషన్రెడ్డి సిఎం కిరణ్కుమార్రెడ్డిని హెచ్చరించారు. అయితే ఆయన చేసిన ప్రకటన ఓ సినిమా పబ్లిసిటీ స్టంట్లో భాగంలా ఉందని అందరూ నవ్వుకున్నారు. ఇక నుంచి కిషన్రెడ్డిని ఈగ అని పిలవచ్చా అని ఆయన్ని సమావేశం ముగిసిన తరువాత ప్రశ్నించారు. రాజధానిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈగ సినిమా ఎంతలా హిట్ అయిందో అలానే ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈయన వెంటబడతారు సరే! సిఎం ఇందిరమ్మబాటలో నిద్ర చేస్తున్న విషయం ఈ ఈగకు తెలుసా? మరి తెలిస్తే హైదరాబాద్లో ఈ ఈగ వాలిందేమిటీ? మరి సిఎం కంటిపై దాడి చేయాలి కదా! మరెందుకు సిఎంను నిద్రపోనిస్తున్నారు? అంటే ఈ ఈగ మాటలు చెప్పటమే కానీ, ఎవరినీ బాధించదేమో! ఒకవేళ బాధపెట్టినా తన పార్టీ వారికే కిషన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఈగకు ఎగరటం వచ్చా? లేదా? మరి ఎలా ఈ ఈగ తెరపై నటిస్తుంది? అదీ రాజకీయతెరపైన అనేది కిషన్రెడ్డే తేల్చాలి. అందరినీ నవ్వించటం కోసమేనా ఈయన ఈగ సినిమా గురించి ప్రస్తావించారని పలువురు కిషన్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో తాను ప్రతిపాదించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ గురించి వారం రోజులు సమయం కూడా అవసరమని కిషన్రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/kishan-reddy-24-16053.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





