కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే...

Publish Date:Apr 26, 2014

Advertisement

 

కాంగ్రెస్ పార్టీకి తెరాసకు, వైకాపాకు మధ్య కుదిరిన రహస్య ఒప్పందాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. అయితే రాహుల్ గాంధీ నిన్న ఎన్నికల ప్రచార సభలో ‘పెహ్లే హాత్ మిలాయే, బాద్ మే గల్లె మిలాయే...బాద్ మే పీట్ మే చూరి చలాయా” (మొదట కేసీఆర్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారని, తరువాత కౌగలించుకొన్నారని ఆనక వెన్నుపోటు పొడిచారని) చెపుతూ కేసీఆర్ తో తమకున్న రహస్య అవగాహన గురించి ఆయనే బయటపెట్టుకొన్నారని అన్నారు.

 

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వాదిస్తున్న కిరణ్ నేటికీ రాష్ట్ర విభజన జరగలేదనే తాను భావిస్తున్నట్లు తెలిపారు. జూన్ రెండున రాష్ట్రం అధికారికంగా వేరు పడేంత వరకు కూడా తాను రాష్ట్ర విభజన జరిగినట్లు అంగీకరించనని అన్నారు. అయినా సుప్రీం కోర్టులో తను వేసిన కేసు వల్ల మళ్ళీ ఏదో ఒకరోజు తప్పకుండా విభజన బిల్లుని పునసమీక్షించే పరిస్థితి వస్తుందని అన్నారు. కాం

 

గ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటి నుండి దానిని వ్యతిరేఖిస్తూ తీవ్ర వాదనలు చేసినప్పటికీ కడదాక ఆయన విభజనకు తనవంతు సహకారం అందిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని చిరంజీవి, రఘువీరా రెడ్డి తదితరులు చెపుతున్నారు. వారికి బదులిస్తూ "అసలు రాష్ట్ర విభజన చేయబోతున్నామని సోనియాగాంధీ నాకెన్నడూ చెప్పలేదు. ఆవిషయం తెలిసినప్పతి నుండి నేను వ్యతిరేఖిస్తూనే ఉన్నాను. కానీ నాతో బాటు ఆ విషయం తెలిసిన చిరంజీవి వంటివారు అందరూ అధిష్టానానికి విదేయులుగా మేలుగుతూప్రజలను మభ్యపెడుతూ నేటికీ తమ మంత్రి పదవులలో కొనసాగుతున్న విషయం నిజం కాదా? అటువంటి వారి విమర్శలకు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నేను జవాబు చెప్పవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. నన్ను విమర్శించే ముందు, మొదట తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రశ్నలకు ఆయన జవాబీయగలిగితే బాగుటుంది," అని అన్నారు.

 

జగన్ గురించి మాట్లాడుతూ, "నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విషయంలో కలుగజేసుకోలేదనే విమర్శలు తర్కబద్దంగా లేవు. ఆయన వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను కలుగజేసుకోవడం సరికాదు. ఆయన సంగతి కోర్టులే చూసుకొంతాయి. ఆయన ముఖ్యమంత్రి అవడానికి నోటికి వచ్చినహామీలు గుప్పిస్తున్నారు. అయితే అవి ఆచరణ సాధ్యం కానివి. వాటిని అమలుచేసే చిత్తశుద్ది ఆయనకు అసలు లేదు. నా స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనవసరం," అని అన్నారు.

 

ఇక జైసపాలో చేరుతామని చెప్పిన వారు అందరూ ఒకరొకరుగా ఎందుకు పార్టీ విడిచి వెళ్ళిపోయారు? మీ పార్టీ ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబిస్తూ “చాలా మంది ఎవరి స్వార్ధం, భవిష్యత్తు, టికెట్స్ వారు చూసుకొని వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం రాష్ట్ర ప్రజల తరపున పోరాడేందుకే నేటికీ కట్టుబడి ఉన్నాను. మా పార్టీ ఎన్నికలలో గెలుస్తుందా లేదా అనేది ప్రధానం కాదు. నా ఆలోచన అంతా ప్రజలను చైతన్యవంతులను చేసి వారికి మంచి భవిష్యత్ ఏర్పరచాలనే తప్ప వేరొకటి లేదు,”అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.