మోదీ సర్కార్ పై ఖర్గే ఫైర్.. 11 ఏళ్లు 33 తప్పులు !

Publish Date:Jun 12, 2025

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.అలాగే..  వరసగా మూడు పర్యాయాలు, అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఎ ప్రభుత్వం మొత్తంగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని , 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 11 సంవత్సరాల పాలన ఎలా ఉందంటే చెప్పడం కష్టమే. అంతా బాగుందని అనలేము, అసలేమీ బాగులేదని చెప్పలేము. అయితే..  వరసగా మూడవ సారి దేశ ప్రజలు మోదీని మెచ్చి ఓటేసి గెలిపించారు, సో ..మోదీ తొలి పదేళ్ళ పాలన ప్రజలకు నచ్చింది. అందుకే, ముచ్చటగా మూడవసారి మోదీకి పట్టం కట్టారు,అనుకోవచ్చును. ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ప్రామాణికం కాబట్టి, మోదీ తొలి పదేళ్ళ పాలనకు పాస్  మార్కుల కంటే, కొంచెం మెరుగైన మార్కులే ప్రజలు ఇచ్చారు. 

నిజానికి..  వరసగా మూడవ సారి అధికారంలోకి రావడం ఒక చారిత్రక విజయమే అయినా..  2014, 2019 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే.. మోదీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. బీజేపీ, ఎన్డీయే స్కోర్ దిగి వచ్చింది. 2014లో 284 స్కోర్’తో.. 30 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒంటరిగానే మెజారిటీ సాధించిన  బీజేపీ 2019లో మరో మెట్టు పైకి ఎక్కింది బీజేపే ఒంటరిగా 303 సీట్లు గెలిచి చరిత్రను సృష్టించింది. అయినా.. సంకీర్ణ ప్రభుత్వాలనే కొనసాగించింది  అనుకోండి అది వేరే విషయం. అలాంటి బీజేపీ స్కోర్  2024లో 240 కి పడిపోయింది. అంటే 63 సీట్లు కోల్పోయింది. అయినా..  ఎన్డీఎ మిత్ర పక్షాల అండతో ఏర్పాటైన  సంకీర్ణ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.

సహజంగానే..  అధికార బీజేపీ,ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నాయకులు, మోదీని  మెచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ 11 సంవత్సరాల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగిందని అభివర్ణించారు. అలాగే..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు,ఎన్డీయే ముఖ్యమంత్రులు మోదీ 11 ఏళ్ల పాలనను ఆహా ..ఓహో అంటూ మెచ్చుకునన్నారు. అదేమంత విశేషం కాదు. మోదీ పాలన ఎన్డీయేకి  ముద్దు.  

అలాగే..  విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, మోదీ పాలన అస్సలు నచ్చలేదు. అది కూడా సహజమే. అందుకే కాంగ్రెస్ సర్వాధికారి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను సింపుల్ గా ఛీ  కొట్టారు. మోదీ ప్రభుత్వాన్ని కలల ప్రభుత్వంగా అభివర్ణించారు. వర్తమానాన్ని వదిలేసి..  2047 గురించి కలలు పంచి, దేశాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. 

మరోవంక..  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మరో అడుగు ముందుకేసి  మోదీని మోసాల పుట్టగా అభివర్ణించారు. మోదీ 11 ఏళ్ల పాలనలో  దేశానికి జరిగిన మేలు శూన్యమని తేల్చేశారు. 11 ఏళ్లలో 33 తప్పిదాలు చేశారని  మోదీ తప్పుల చిట్టాను వినిపించారు.  గతంలో పార్లమెంటులో కూడా తాను ఇదే మాట చెప్పిన సంగతిని గుర్తు చేశారు.  ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం, యువకులను మోసం చేయడం, పేదలను కడగండ్లపాలు చేస్తున్న ఇలాంటి ప్రధానిని  తమ రాజకీయ జీవితంలోనే చూడలేదని, ఖర్గే పేర్కొన్నారు.

ఇక అక్కడి నుంచి  ఖర్గే  ఆయనే చెప్పినట్లుగా, పార్లమెంట్ లోపలా బయటా చాలా కాలంగా చెపుతూ వచ్చిన  సంగతులనే మరోమారు వల్లె వేశారు. డిప్యూటీ స్పీకర్ సహా  విపక్షాలకు మోదీ ఏ చిన్న పోస్ట్ ఇవ్వడం లేదు అని మొదలు పెట్టి  ఈడీ దాడుల వరకు.. మోదీ ప్రభుత్వం  మొత్తం 33 తప్పులు చేసిందని ఎత్తిచూపారు. 

అయితే..  మోదీ 11 ఏళ్ల పాలనను అధికార విపక్షాలు, ఎలా చూసినా, ఏమనుకున్నా  తాజాగా, నిర్వహించిన మూడ్ అఫ్ డి నేషన్ సర్వే లు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ  ఎన్డీయేదే అధికారమని చెపుతున్నాయి. అంతే కాదు  2024 కంటే, ఈసారి.. బీజేపీ సొంత సంఖ్యా బలంతో పాటుగా ఎన్డీయే సంఖ్యా బలం కూడా పెరుగుతుందని చెపుతున్నాయి.  ఇండియా టుడే 2025 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో  బీజేపీ 281 సీట్లతో సింపుల్ మెజారిటీ మార్క్  (273) క్రాస్ చేస్తుందనీ, అలాగే..  ఎన్డీఎ 343 సీట్లు గెల్చుకుంటుందని దీంతో  కాంగ్రెస్,ఇండియా కూటమి బలం తగ్గుతుందని సంకేతాలు ఇస్తోంది.  కాంగ్రెస్ బలం  99 నుంచి  78కి, ఇండియా కూటమి నెంబర్ 232 నుంచి 184కు పడిపోతుందని సర్వే చెపుతోంది. అలాగే..  తాజగా ఆపరేషన్ సిందూర్ తర్వాత నిర్వహించిన మరో సర్వేకూడా బీజేపీ, ఎన్డీయే కే జై కొడుతున్నది.. సో  11 ఏళ్ల మోదీ పాలనకు  ఇప్పటి వరకు అయితే  ప్రజామోదం పుష్కలంగానే ఉన్నట్లుంది. సందేహం లేదు. అయితే.. ఎన్నికలకు ఇంకా నిండా నాలుగు సంవత్సరాల సమయం వుంది. ఈలోగా ఏమైనా జరవచ్చును.

By
en-us Political News

  
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
Publish Date:Jul 3, 2025
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.