ఫ్రస్ట్రేషన్ లో కేశినేని నాని.. మూడు నెలలు పెన్షన్లు రావంటూ బెదరింపులు

Publish Date:Apr 1, 2024

Advertisement

తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ బ్రేక్ అయిన క్షణం నుంచీ ఆయన తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారు. వరుసగా రెండు సార్లు ఎంపీ కావడానికి కారణమైన తెలుగుదేశం పార్టీని అహంభావంతో వీడి.. వైసీపీ గూటికి చేరిన కేశినేని నానికి... ఇప్పుడు భవిష్యత్ గందరగోళంగా కనిపిస్తోంది. పార్టీని వీడి విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి  టికెట్ సంపాదించుకున్నా.. గెలిచే అవకాశాలు ఇసుమంతైనా కనిపించకపోవడంతో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. దీంతో ఈసీ ఆదేశాలకు సైతం వక్రభాష్యాలు చెబుతూ జనాలను బెదరించడానికి కూడా వెనుకాడటం లేదు.  

విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశంను కాదని విజయం సాధించడం సాధ్యం కాదన్న విషయం రోజు రోజుకూ విస్పష్టంగా అర్ధమౌతుండటంతో ఆయనలో నిరాశ నిస్ఫృహలు నెలకొన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు ఆయన మాటలను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వాలంటీర్లను పించన్ల పంపిణీకి దూరంగా ఉంచాల్సిందేనంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన నమ్ముకుని వచ్చిన వైసీపీ నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వచ్చే మూడు నెలల వరకూ వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు రావనీ, వాళ్లు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ కేశినేని నాని హెచ్చరిస్తున్నారు.

ఒక విధంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశాలకు  తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులే కారణమని చెబుతున్నారు.  పేదులు ఇబ్బందులు పడతారు, మూడు నెలలు పింఛన్లు అందకపోతే  మందులు, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు వారి వద్ద డబ్బులు ఉండవు అంటూ మీడియా సమావేశంలో కేశినేని చెప్పారు.  అయితే పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించలేదు. ఆ పంపిణీ నుంచి వాలంటీర్లను మాత్రమే దూరం పెట్టింది. అలాగే పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులలో  వీటిని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని విస్పష్టంగా పేర్కొంది.    ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వాలంటీర్లను మాత్రమే నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలకు కేశినేని నాని వక్రభాష్యం చెబుతున్నారు.  కేశినేని నాని చెప్పిన దాని ప్రకారం  జగన్ పింఛన్లు నిలిపివేయాలని లేదా పంపిణీలో మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని అధికారులను ఆదేశించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ కు అలా   ఆదేశాలిచ్చే అధికారాలు లేవు. అయినా అధికారులలో తనకు తొత్తులుగా ఉన్నవారి ద్వారా ఇటువంటి ఆదేశాలు అమలు అయ్యేలా ఏమైనా కుట్రలకు తెరతీశారా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యేలా కేశినేని మాటలు ఉన్నాయి.    పింఛన్లు సక్రమంగా అందకుండా అవరోధాలు సృష్టించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని , కుట్రపూరితంగా ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఆరోపణలు, ఫిర్యాదులు గుప్పించి, ఆ వ్యవస్థను స్తంభింప చేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారనీ జనం అనుకునేలా చేయాలన్న లక్ష్యంతో జగన్  కుట్రలు చేస్తున్నారా అన్న అనుమానాలు తావిచ్చేలా కేశినేని నాని మాటలు ఉన్నాయన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అవుతున్నాయి. కేశినేని తన వ్యాఖ్యల ద్వారా.. జగన్ ప్లాన్ బయటపెట్టేసినట్లైందని వైసీపీ వర్గాలు సైతం నానిపై గుర్రుగా ఉన్నారు.

మొత్తం మీద వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందవంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా జగన్ సర్కార్ ఎత్తుగడను దెబ్బ తీశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయమై ఇప్పుడు తెలుగుదేశం సీరియస్ గా  సీఎస్ కు, ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం ద్వారా విషయాన్ని పబ్లిక్ చేశాయనీ, ఇప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అర్హులందరికీ పింఛన్లు నేరుగా ఇళ్ల వద్దనే అందించాలంటూ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  

By
en-us Political News

  
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.