తెలంగణా ముఖ్యమా ఉద్యమాలు ముఖ్యమా?

Publish Date:Jul 20, 2013

Advertisement

 

ఇటీవల తెరాస కండువా కప్పుకొన్న కాంగ్రెస్ నేత కే.కేశవ్ రావు ఈరోజు తన కొత్తబాస్ కేసీఆర్ మనసులో మాటను చల్లగా బయటపెట్టాడు. “కాంగ్రెస్ పార్లమెంటులో బిల్లుపెట్టేవరకు కూడా తెలంగాణా ఇస్తుందని తమకు నమ్మకం లేదని, ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా ఇవ్వకపోయినా మరో ఆరునెలలు కోట్లాడి సాధించుకొంటామని” ఆయన చెప్పారు. అంటే తెలంగాణా సాధన కంటే, ఆ పేరిట మరో ఆరునెలలు ఉద్యమాలు చేసుకొనే అవకాశం ఉంటేనే మేలని ఆయన ఉద్దేశ్యం కాబోలు.

 

ఆయన కాంగ్రెస్ లో ఉన్నంతకాలం తెలంగాణా కోసం గొంతు చించుకొని మాట్లాడేవారు. తమ పార్టీ తెలంగాణా ఇవ్వదని, పార్టీలో ఉంటూ ఎటువంటి ఉద్యమాలు చేసే అవకాశం లేదని భావించిన కేశవ్ రావు, తెరాసలో చేరితే చురుకుగా ఉద్యమాలలో పాల్గొనవచ్చుననే ఉద్దేశ్యంతో, తనకి అత్యున్నత హోదానిచ్చిన కాంగ్రెస్ కండువాని చెత్త కుండీలోకి విసిరేసి, తెరాస కండువా వేసుకొన్నారు. కానీ, ఆయన పార్టీ మారగానే పరిస్థితులు కూడా ఒక్కసారిగా మారిపోయాయి.

 

అంతవరకు ఉద్యమాలతో కాంగ్రెస్ ను ఒక ఆట ఆడించిన తెరాస చేతిలోంచి తెలంగాణా సెంటిమెంటును కాంగ్రెస్ కాకి రివ్వున వచ్చిఎత్తుకుపోయింది. ఇప్పుడు అది తెరాసను పక్కన పడేసి తానే స్వయంగా తెలంగాణా ఇచ్చేందుకు సిద్దం అవుతుండటంతో, ఎన్నెన్నో ఆలోచనలతో పార్టీ మారిన కేశవ్ రావుకి ఇప్పుడు ఏమిచేయాలో పాలుపోవడం లేదు. ఒకపక్క కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేస్తానని హడావుడిపడుతుంటే, ఇక ఉద్యమాల అవసరం ఏముంటుంది. తెరాసలో ఉండి చేసేదేముంటుంది?

 

అదేవిధంగా తెలంగాణా కోసం తన తల నరుకొన్నేందుకు కూడా సిద్ధమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, ఇప్పుడు తెరాసను విలీనం చేస్తే తెలంగాణా ఇస్తానని కాంగ్రెస్ చెపుతున్నపటికీ, ఎందుకు వెనకాడుతున్నట్లు? అంటే ఆయనకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకంటే, తన రాజకీయ ప్రయోజనాలు, పార్టీని నిలుపుకోవడమే ముఖ్యమని అర్ధం అవుతోంది.

 

ఒకవేళ కేసీఆర్, కేశవ్ రావులు నిజంగా మనస్పూర్తిగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని కోరుకొంటుంటే, అందుకోసం తమ బేషజాలు, కోరికలు, కలలు, రాజకీయ ప్రయోజనాలు అన్నీటినీ పక్కనబెట్టి, తెలంగాణా ఏర్పాటుకి తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరించి ఉండాలి. కానీ, వారిద్దరూ ఆవిధంగా చేసేందుకు సిద్ధంగాలేరు.

 

తెలంగాణా సెంటిమెంట్ సజీవంగా నిలిస్తేనే తెరాస కలలుకంటున్నట్లు వచ్చేఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేస్తే అప్పుడు కాంగ్రెస్ హస్తానిది పైచేయి అవుతుంది. గనుక, వచ్చే ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని, ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పారు.

 

మరి, తెలంగాణా వద్దంటున్న ఇటువంటి నేతలను నిలదీయకుండా, తెలంగాణాకి అడ్డుపడుతున్నారని వేరేవరినో నిందించడం ఎందుకు?ఇటువంటి నేతల శల్యసారధ్యంలో సాగుతున్న తెలంగాణా ఉద్యమం కోసం, ఉజ్వల భవిష్యత్తు ఉన్నవిద్యార్ధులు బలిదానాలు చేసుకోవడం వల్ల ఏమి ప్రయోజనం?ఎవరికి లాభం కలుగుతుంది?

By
en-us Political News

  
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.