కేజ్రీవాల్ చిన్న చీమతో సమానం : సల్మాన్ ఖుర్షీద్
Publish Date:Oct 23, 2012
Advertisement
కాంగ్రెస్ పార్టీ ఏనుగులాంటిదని, చీమలాంటి కేజ్రీవాల్ అనవసరంగా రెచ్చిపోతున్నారన్న విషయాన్ని తనంతటతానుగా తెలుసుకోవాలని కేంద్రమంత్రి సల్మాన్ ఘుర్షీద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖుర్షీద్ పై కేజ్రీవాల్ ఆరోపణలు చేశాక.. నాకు పెన్నుతోనే కాదు రక్తంతో కూడా రాయడంవచ్చు అంటూ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని కలిగించాయి. అవినీతిపై పోరు పేరుతో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నేతలతో చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయ్. ఉద్దేశపూర్వకంగా తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారంటూ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలమీద విమర్శలు కురిపించారని బిజెపి జాతీయ అధ్యక్షుడు సంతోషించేలోగానే కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆయనపైకూడా ఆరోపణల్ని గుప్పించారు. కేజ్రీవాల్ దాదాపుగా పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతూ క్రేజ్ ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. రోజురోజుకీ కేజ్రీవాల్ ఆరోపణల పర్వం కారణంగా రాజకీయవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన పెరిగిపోతోందని విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kejriwal--salman-khurshid-31-18452.html





