కేసీఆర్ బావమరిది కన్నుమూత..!
Publish Date:Aug 13, 2026
Advertisement
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంపల్లికి సమీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్న అపార్ట్మెంట్లో శ్రీనివాస్ రావు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కుమారుడు హైదరాబాద్కు వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. శ్రీనివాస్ రావు మృతితో కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్వయాన మేనమామ. మేనమామ మృతి వార్త తెలియడంతో కేటీఆర్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. శ్రీనివాస్ రావు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు హరీశ్ రావు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతితో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పలువురు నేతలు సంతాపం తెలిపారు. KCRs brother-in-law passes away, Joginapalli Srinivas Rao, KTR, BRS Party, Yashoda Hospital,
Harish Rao, Kavitha
http://www.teluguone.com/news/content/kcrs-brotherinlaw-passes-away-36-228839.html





