గద్దర్ కు దళిత బంధు బాధ్యతలు? టీఆర్ఎస్ నేతల మంతనాలు..

Publish Date:Aug 31, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా వేడెక్కాయి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరాలతో స్పీడ్ పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అధికార పార్టీ దళిత బంధు స్కీం తీసుకొచ్చింది. త్వరలో మరిన్ని బంధులు తెస్తామని చెబుతున్నారు సీఎం కేసీఆర్. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల కూడా జిల్లాలు చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల లక్ష్యం హుజురాబాద్ అసెంబ్లీ  ఉప ఎన్నిక చుట్టే సాగుతోంది. 

తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల వలసలు కూడా జోరందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలను ప్రభావితం చేసే నేతలను తమ బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే  ప్రజా గాయకుడు గద్దర్‌పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసంలో గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు. దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ నేతలు గద్దర్ చర్చలు జరిపారని తెలుస్తోంది. 

హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వారు గద్దర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరినట్లు సమాచారం. అంతేకాదు దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మాటగా గద్దర్ కు మంత్రి కొప్పుల ఆశ్వర్ చెప్పారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ ప్రతిపాదనపై గద్దర్‌ ఇంకా  హామీ ఇవ్వలేదన చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనపై గద్దర్ సానుకూలంగా స్పందిస్తారనే ఆశతోనే ఉన్నారు. 

గద్దర్ తో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపాడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా  తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్‌ నేతలు గద్దర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డితో రాజకీయాలపైనా గద్దర్ చర్చించారనే సమాచారం టీఆర్ఎస్ పెద్దలకు వచ్చిందట. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే అప్రమత్తమై.. గద్దర్‌ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సీఎం కేసీఆర్ పంపించారనే ప్రచారం జరుగుతోంది. 

మొత్తానికి విప్లవ భావజాలమున్న గద్దర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం... టీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు సాగించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లీకులు వస్తున్నట్లుగా దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం కోరితే.. అందుకు గద్దర్ ఓకె చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలతో గద్దర్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది కూడా చర్చగా మారింది. 

By
en-us Political News

  
శత కోటి ద‌రిద్రాల‌కు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైర‌సీకి మాత్రం ఒక్క‌టంటే ఒక్క ఉపాయం కూడా క‌నుగొన‌లేక పోవ‌డం విచార‌క‌రం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే ప్ర‌స్తుతం టాలీవుడ్ జ‌నాల‌ను వేధిస్తోన్న ప్ర‌శ్న‌.
జ‌పాన్ మాంగా క‌ళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జ‌పాన్ కి భారీ సునామీ రానుంద‌ని చెప్ప‌డంతో.. ఎంద‌రో త‌మ జ‌పాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్క‌సారిగా జ‌పాన్ టూరిజం ప‌డ‌కేసింది.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా? అంటే.. విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టుగా హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ శ‌తాబ్దానికే ఇది జోక్ కావ‌చ్చు. ఈ భూమ్యాకాశాల మ‌ధ్య కేసీఆర్ కి తెలియ‌ని రాజ‌నీతి లేదు. రెడ్డి, క‌మ్మ‌గా విడిపోయి కొట్టుకు ఛ‌స్తున్న ఉమ్మ‌డి ఆంధ్ర రాజ‌కీయాల్లో వెల‌మ‌ల పాత్ర‌ను తిరిగి తీసుకురావ‌డంలో అప‌ర చాణ‌క్యుడ‌న్న పేరు సాధించారాయ‌న‌. అంతేనా కేసీఆర్ అన్నీ తెలిసే కావాల‌నే చేశారని అంటారు. అలాగ‌ని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేద‌ని చెబుతారు.
తిరుమల కొండపై ఏనుగులు హల్‌ చల్‌ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (జులై 4)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ నారాయణ గిరి షెడ్ల వరకూ సాగింది.
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి నేడు. దేశ ఆత్మగౌరవ ప్రతీకగా జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశ భక్తులు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
Publish Date:Jul 3, 2025
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.