కేసీఆర్ హస్తిన బాట.. అజెండా మాటున బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు వ్యూహాలు

Publish Date:May 10, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తనయుడు కేటీఆర్ కు అప్పగించేసి హస్తిన బాట పట్టనున్నారా? ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆయన ప్రవచించిన జాతీయ అజెండా కు మద్దతు కోసం మళ్లీ ఫ్రెష్ గా ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఒక ప్రముఖ దినపత్రికలో ముఖ్యమంత్రి సీపీఆర్వో (ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి) వనం జ్వాలా  నరసింహరావు రాసిన వ్యాసం చదివితే ఔననే సమాధానం వస్తుంది. ఇక ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాక జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారన్నది అవగతమౌతుంది.

ఇందుకు తగ్గట్టుగానే  టీఆర్ఎస్ కార్యనర్వాహక  అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రభుత్వ కార్యక్రమాలలో అన్నిటా తానై వ్యవహరిస్తున్నారు. మంత్రులు చేయాల్సి ప్రారంభోత్సవాలను కూడా ఆయనే చేసేస్తున్నారు. ఏ హోదాలో కేటీఆర్ ఇదంతా చేస్తున్నారన్న సందేహం ఎవరికైనా కలగొచ్చేమో కానీ టీఆర్ఎస్ లో మాత్రం అలాంటి అనుమానాలు ఎవరికీ రావు. ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం తరువాత ఒక ప్రముఖ దినపత్రికలో  సీఎం సీపీఆర్వో రాసిన వ్యాసం చదివితే.. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ స్థాయిలో తన ముద్రవేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు భావించాల్సి వస్తుంది. 
అందుకే ఇటీవలి కాలంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆయా శాఖల మంత్రులతో సంబంధమే లేకుండా ప్రారంబోత్సవాలకు హాజరౌతున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రకటనలూ ఆయనే చేస్తున్నారు. ముఖ్య మంత్రి వద్ద ఉన్న శాఖల వ్యవహారాలూ ఆయన చూస్తున్నారు.

అంతే కాకుండా ఇటీవలి కాలంలో ఆయన భాషలో ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తున్నది. యాసలో కానీ, ఉపయోగించే పరిభాషలో కానీ తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుకరిస్తున్నారు. విమర్శలలో పదును పెంచారు. తండ్రికి రాజకీయ వారసుడిగా జనంలో గుర్తింపు పొందేందుకే ఆయన తన ఆహార్యాన్ని, భాషనూ మార్చుకుంటున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుంటే కేసీఆర్ ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరం కావడం ఖాయమేననిపించక మానదు. టీఆర్ఎస్ సీనియర్లు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే విషయాన్ని చెబుతున్నారు.  వారి మాటల ప్రకారం..ప్రస్తుతం ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్, ఈ నెల 14వరకూ అక్కడే ఉంటారు. ఆ తరువాత ఆయన హస్తిన బాట పట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. 

జాతీయ అజెండా అంటూ తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశ వ్యాప్తం చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించినా.. కేసీఆర్ వ్యూహం  మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీయేతర శక్తుల ఏకీకరణేననీ, దానికి ఫంట్ర్ లు, కూటములు అంటూ రాజకీయ భాష వాడకుండా జాతీయ అజెండా నామకరణం చేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అజెండా పేరిట బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకువస్తే... ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి చక్రం తిప్పే అవకాశం ఉంటుందని ఆయన భావనగా చెబుతున్నారు.  ఏది ఏమైనా మొత్తం మీద  ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని అంటున్నారు. ఇందుకు ఆయన మీడయా మద్దతు కూడగట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ప్రముఖ దినపత్రికలో సీఎం సీపీఆర్వో కేసీఆర్ ఆలోచనలు, లక్ష్యాలను వివరిస్తూ రాసిన సుదీర్ఘ వ్యాసం అని  విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రాంతీయ పత్రికల మద్దతు సరిపోదు కనుక ఆయన జాతీయ మీడియాలో తన అజెండా ప్రత్యేకతలు ప్రసారం కావాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఢిల్లీలో తన పీఆర్వోను నియమించారు. ఆయన ద్వారా జాతీయ మీడియాలో కూడా తన ప్రస్తావన ప్రముఖంగా వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే  కొన్ని జాతీయ చానెళ్లలో కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ అజెండాపై ప్రముఖంగా వార్తా కథనాలు ప్రసారమవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.