క‌ష్టాల్లో బీఆర్ఎస్‌.. చేతులెత్తేసిన కేసీఆర్‌?

Publish Date:Jan 8, 2025

Advertisement

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌రువాత ఒక‌రు జైలుకెడుతున్నారు. త్వ‌ర‌లో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ప‌రిస్థితి ఇలానే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో బీఆర్ఎస్ ప్ర‌భావం ఇసుమంత కూడా ఉండ‌ద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల‌ను, క్యాడర్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్నది. అయితే  కొంద‌రు పార్టీ నేత‌లు మాత్రం కేసీఆర్ పై ఆశ‌లు పెట్టుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పాలిటిక్స్‌లో మ‌ళ్లీ యాక్టివ్ అవుతార‌ని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ద‌బిడిదిబిడే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ  బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. కేసీఆర్ రాజ‌కీయాల నుంచి పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నాటి నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. కేటీఆర్ అరెస్టు అయినా కూడా కేసీఆర్‌ బ‌య‌ట‌కు రాక‌పోవ‌చ్చున‌ని, హ‌రీశ్‌, క‌విత‌లే పార్టీ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌న్న చ‌ర్చ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. మ‌రోవైపు, కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల వారిగా నేత‌లు ఆయ‌న్ను క‌లిసి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతోంద‌నీ, మీరు పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ కావాల‌ని విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప‌దేళ్లు పాలించిన కేసీఆర్‌,  2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ త‌రువాత  ఆయ‌న ఇంట్లో స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురై కొన్ని రోజులు బెడ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల స‌మ‌యంలో ప‌లు బ‌హింగ స‌భ‌ల్లో పాల్గొని కేసీఆర్ ప్ర‌సంగించారు. పార్ల‌మెంట్ ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కుకూడా కేసీఆర్ హాజ‌రు కాలేదు. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్రం అసెంబ్లీకి హాజ‌రైన కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీది చెత్త‌ బ‌డ్జెట్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌ నుంచి ప్ర‌తీరోజూ అసెంబ్లీకి వ‌స్తాన‌ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వ  త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను చీల్చిచెండాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. కానీ, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాకుండా డుమ్మా కొడుతున్నారు.   కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన అనుభవం మాకు మార్గదర్శకంగా ఉంటుందని ప‌లుసార్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించినా కేసీఆర్ పట్టించుకోలేదు. అసెంబ్లీకి ముఖం చాటేశారు. అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఎక్కడా కేసీఆర్ కనిపించడంలేదు.  పార్టీ నేతలు ఎవరైనా ఇంటికి వెళ్లి కలిస్తే వారితో మాట్లాడి పంపిచేస్తున్నారు. ఒక్కసారి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరికలు అంటూ కొంత మందిని తీసుకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అది అధికారిక వీడియో కాదు. ఓ వ్యక్తి ఫోన్లో  తీసిన వీడియో. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడప్పుడే బయటకు రావాలని అనుకోవడం లేదు.

కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సుమారు ఐదు నెల‌లు జైలు జీవితం గ‌డిపారు. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురైన‌ట్లు ఆ పార్టీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో  పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ అరెస్టు కాబోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనూ కేసీఆర్ ఆందోళ‌నలో ఉన్నారని అంటున్నారు. అయితే, 2025 జనవరి  నుంచి కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారని గ‌తంలో ప‌లుసార్లు కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌టంతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితి అందుకు విరుద్దంగా క‌నిపిస్తోంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ లేదా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఏసీబీ పెట్టిన ఫార్ములా ఈ-కారు కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీష‌న్ ను కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇహనో ఇప్పుడో కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్ రావు, క‌విత భుజానికెత్తుకోనున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే క‌నీసం ఆరేడు నెల‌ల్లు లేదా ఇంకా ఎక్కువ కాలం  జైల్లో ఉండే అవ‌కాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ స‌ర్కార్‌ దూకుడు ముందు హ‌రీశ్ రావు, క‌విత సార‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ  ఏ మేర‌కు నిల‌దొక్కుకోగ‌ల‌దన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద పార్టీ  కష్టాల్లో ఉన్నా కేసీఆర్ బయటకు రావడం లేదంటే పార్టీ విషయంలో ఆయన చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది. 

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యి.. కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కాకుండా ఉంటే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కొంద‌రు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తెర‌పైకి తెచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.. ఈ క్ర‌మంలో భారీ సంఖ్య‌లో జిల్లాల వారిగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌న్న డిమాండ్ ఆ పార్టీ నేత‌ల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ మాత్రం ఇక నావ‌ల్ల కాదు అన్న‌ట్లుగా చేతులెత్తేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ చ‌ర్చే నిజ‌మైతే రాబోయే కాలంలో బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాజ‌కీయాల్లో క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న ఉంది.

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.