గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ బీఆర్ఎస్ అధినేత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన క్రీయాశీలంగా లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బలహీనపడింది. ఆ పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది. అయితే కేసీఆర్ అధికారంలో ఉండగా వాగ్దానాలను ఏ మేరకు నిలబెట్టుకున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అయితే గత ఎన్నికలకు ముందు ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఉంటా... ఓడితే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని విస్పష్టంగా చెప్పారు. ఆ మాటకే కట్టుబడి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అధికారంలో ఉంటేనే ప్రజా జీవితంలో ఉంటాననీ, లేకుంటే రెస్టు తీసుకుంటాననీ ఆయన ఎన్నికలకు ముందే విస్పష్టంగా చెప్పేశారు. ఆ మాట మీదే నిలబడ్డారు. నిలబడుతున్నారు. ఇందులో ఆయనను తప్పుపట్టాల్సిన పని లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావం తరువాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆయా ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తాను అన్న హామీ నుంచి భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి వరకూ ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే వాటి అమలును ఎన్నడూ పట్టించుకోలేదు. మాట ఇవ్వడం, మాట తప్పడం కేసీఆర్ కు అలవాటే అన్న భావన తెలంగాణ సమాజంలో పాతుకుపోయింది.
అలా కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడతాను అని నిరూపించాలని కేసీఆర్ భావించారో ఏమో.. పార్టీ ఓటమి తరువాత ఆయన చెప్పిన విధంగా ఫామ్ హౌస్ కే పరిమితమై రెస్టు తీసుకుంటున్నారు. గత 13 నెలలుగా రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ వానప్రస్థంలో గడుపుతున్నట్లు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రత్యేక తెలంగాణా డిమాండును నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశన సందర్భంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. నిజానికి మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్ రెండేళ్ళు కార్మిక మంత్రిగా పని చేశారు. అందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై సంతాప తీర్మానంపై మాట్లాడతారని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి బయటకు రాలేదు.
కేసీఆర్ తీరు కారణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ చీలికలు పేలికలుగా మారిపోయే పరిస్ధితిలో ఉంది. కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్యా పార్టీ పగ్గాల కోసం అంతర్గత పోరు జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్యాడర్ అయితే కేటీఆర్, కవితల మధ్య నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మొత్తం మీద అధికారంలో ఉండగా సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. అధికారం పోయిన తరువాత రాష్ట్రాన్ని, ప్రజలను, చివరకు పార్టీనీ కూడా పట్టించుకోకుండా మౌనంగా ఉండటం ఆయన ప్రతిష్టను మసకబారుస్తోందనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-confine-to-farm-house-25-190743.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.