కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్

Publish Date:Jun 11, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  కాళేశ్వరం కమిషన్  ముందు విచారణకు హాజరయ్యారు.  సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి  బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.  ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వెంట ఈ విచారణకు వచ్చేందుకు  మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కమిషన్ అనుమతించింది.  ఇలా ఉండగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి బయలుదేరుతుండగా ఎర్రవల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు కాలు జారి పడిపోయి గాయపడ్డారు. దీంతో ఆయనను సికిందరా బాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.    ఆ తరువాత మార్గమధ్యంలో కేసీఆర్ కాన్వాయ్ లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఈ అపశ్రుతులేంటంటూ బీఆర్ఎస్ శ్రేణులు మధనపడుతున్నాయి. 

కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు నేపథ్యంలో బీఆర్క్కే భవన్ కు వచ్చే దారులలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే బీఆర్కు భవన్ లోకి  అందులో పని చేసే ఉద్యోగులను వినా మరెవరినీ అనుమతించడం లేదు. అలాగు బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని పూర్తిగా మూసి వేశారు.  

ఇలా ఉండగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావడానికి ముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు నిలబెడితే ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదని  పేర్కొన్న కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పటి ఫోటోను ఆ పోస్టుకు జత చేశారు. 

By
en-us Political News

  
రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.
పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి.
కారు కిందపడ్డ సింగయ్యను వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.
గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది.
వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ సరిహద్దులు దాటి పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ, అప్పట్లో అధికారం నిలుపుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను ఒక అస్త్రంగా వాడుకున్నారు.
ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. జూలై 1 విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నాది.
వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు.
హైదరాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.