కేసీఆర్‌కి జగన్ అంటే అంత ప్రేమ ఎందుకో తెలుసా?

Publish Date:Jun 2, 2025

Advertisement

 

రెండు పార్టీలు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు, రెండు జాతీయ గీతాలంటూ తీవ్రంగా కొట్టుకు ఛస్తున్నాయి కదూ. అయితే వీరు పెట్టుకుని నిజానికి పెట్టుకోవల్సింది వైయస్ విగ్రహానికి. వైయస్ ఆనాడు చంద్రబాబును ఏమీ చేయలేక.. చిన్నారెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడి ద్వారా నలభై మంది వరకూ పోగేసి.. ఢిల్లీకి పంపారు. పర్పస్.. పాతబడిన తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి రీయాక్టివేట్ చేయడానికి. అలా ప్రాంతీయ వాదాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబును దెబ్బ తీసే యత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోవడం వైయస్ అధికారంలోకి రావడం తెలిసిందే. 

అప్పటికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి స్తాపించారు. కానీ ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. ఈ విషయం పసిగట్టిన వైయస్, చిన్నారెడ్డి రూపంలో ఢిల్లీకి తెలంగాణ వాదం వినిపించేందుకు పంపారు. తర్వాతి కాలంలో కూడా ఆయన తెలంగాణ వాదులను చాలా రకాలుగా విమర్శించి వేధించేవారు. స్వయంగా కేసీఆర్ ను "నీకు బాబుగానీ మంత్రి పదవి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ" తీవ్ర అవమానకరమైన కామెంట్లు చేసేవారు. 'ఏవయ్యా రాజేంద్రా!' అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పటికీ చాలా మంది చెవుల్లో మారు మోగుతున్నాయి కూడా. 

ఒక పక్క తెలంగాణ కోసం చిన్నారెడ్డిలాంటి వాళ్లను రెచ్చగొట్టిన వైయస్ సరిగ్గా అదే సమయంలో.. తెలంగాణ రాకుండా అడ్డుకున్నట్టు కూడా చెబుతారు. 2009 ఎన్నికల సమయంలో "తెలంగాణకు వెళ్లాలంటే వచ్చే రోజుల్లో పాస్ పోర్టు అవసరమంటూ" వివాదాస్పద వ్యాఖ్యలను చేసి.. తర్వాత గెలిచిన ఘన చరిత్ర వైయస్ ది. అంతగా తెలంగాణ వాదంతో ఆడుకున్న వ్యక్తి వైయస్. ఎప్పుడైతే వైయస్ మరణించారో అప్పుడు తెలంగాణ వాదానికి ఊపిరి తీసుకున్న పరిస్థితి. 

ఒక సమయంలో వైయస్ ఉండగా తమకిక తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదన్న కోణంలో కొందరు తీవ్రంగా ఫీలయ్యేవారు కూడా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వైయస్ కి అంతటి గ్రిప్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఎంపీలను ఇచ్చే సీఎం కావడంతో.. ఢిల్లీ అధిష్టానం కూడా వైయస్ మాట జవదాటేది కాదు. ఇటు సీట్లు, అటు నోట్ల కట్టలతో వైయస్ ఢిల్లీ పెద్దల దగ్గర అంతగా తన మాట నెగ్గించుకునేవారు. అందుకే "వైయస్ చచ్చి ఏలోకాన ఉన్నారో కానీ.." అంటూ కేసీఆర్ తరచూ అంటుండేవారు. 

అయితే ఇక్కడ వైయస్ తెలివి ఏంటంటే తెలంగాణ సెంటిమెంటు అడ్డు పెట్టుకుని.. ఢిల్లీ పెద్దలను గట్టిగానే గ్రిప్ లో పెట్టుకునేవారు. ఒక సమయంలో వైయస్ వల్లే విపరీతంగా బలిదానాలు జరిగాయన్న మాట వినిపించేది. వైయస్ మరణానంతరం కాస్త తెరిపిన పడ్డారు తెలంగాణ వాదులు. అంతగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దారుణంగా అడ్డుకున్నారు. వైయస్ మరణానంతరం.. అంటే 2014లో తెలంగాణ రావడంతో.. పాత కక్షలన్నీ మరచి పోయి.. వైయస్ ని కేసీఆర్ గౌరవించేవారని అంటారు. అంతే కాదు ఆయన కొడుకు జగన్ సైతం తెలంగాణ రాకను రాజకీయంగా అంగీకరించేవారు కాదు. దానికి తోడు ఈ ప్రాంతంలో కేసీఆర్ కి అడ్డుగా తన పార్టీని లేకుండా సమూలంగా తొలగించి.. ఏపీకి తన రాజకీయాలను పరిమితం చేశారు. 

దీంతో వైయస్ అన్నా, ఆయన కొడుకు జగన్ అన్నా.. కేసీఆర్ కి వల్లమాలిన అభిమానం. ఒక దశలో జగన్, షర్మిళ ఆస్తి పంపకాల పంచాయితీ కూడా కేసీఆర్ దగ్గరకే వచ్చింది. అలా కేసీఆర్, జగన్ ఇరువురు నేతలు రెండు ప్రాంతాలను చీల్చుకుని.. వాటి ద్వారా అధికారంలోకి రావడంతో.. ఇద్దరి మధ్య సత్సంబంధాలతో పాటు.. కొన్ని కొన్ని ఒప్పందాలు జరిగి ఎవరికి సాగినంతగా వారు సాగించుకున్నట్టు చెబుతారు. వైయస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకోవడం. ఆయన అడ్డుకోవడం వల్ల యువత బలవన్మరణాలకు పాల్పడ్డంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని నమ్ముతారు కేసీఆర్. దీంతో ఆయన వైయస్ ఫ్యామిలీ అంటే అంతటి అభిమానం చూపుతారని అంటారు

By
en-us Political News

  
పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు వచ్చా రు . గత ఏడాది జరిగిన ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ దూకుడు పెంచింది. పాత చిట్టాకు కొత్తగా యాడవుతున్న ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరినీ పిలిచి వాగ్మూలాలను నమోదు చేస్తోంది. సిట్ నిజానికి, ఇంతవరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంలో సిట్ కు కూడా స్పష్టత లేదని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.
ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
సింగయ్య మతి కేసులో ఏ2గా ఉన్నజగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు జులై 1కి వాయిదా వేసింది. ఆ సందర్భంగా అప్పటి వరకూ జగన్ పై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పురుషుల సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
మంత్రి సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలలో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్‌ చేసి వివాదాల్లో నెడుతున్నారా?.. గుంటూరులో జగన్ కాన్యాయ్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు? తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిస్తున్న ప్రచారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 డీహెచ్‌ 2349 కారు ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.