కవిత బీఆర్ఎస్.. వైసీపీలో గుబులు, తెలుగుదేశం కూటమిలో జోష్!.. ఎందుకంటే?

Publish Date:May 2, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది. 

అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.  

అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు. 

ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.