Publish Date:Apr 29, 2020
రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు పై గతంలో చెప్పుతో దాడి చేసిన వ్యక్తి మేడి శెట్టి ఇజ్రాయిల్ పై మంగళవారం హత్యాయత్నం జరిగింది.
రామచంద్రపురం మండలం మసకపల్లి గ్రామంలో ఇజ్రాయిల్ పై దుండగులు కత్తులతో దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఇజ్రాయిల్ ను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తనపై దాడి జరిగిన తీరును మేడిశెట్టి ఇశ్రాయేల్ వివరించాడు.
రాడ్తో నెత్తి మీద కొట్టారు. వాళ్ళను తోసి పరుగెడుతుంటే వెనక తరిమి తరిమి వేడకొడవళ్ళతో నరికారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుతూ కాలువలో పడిపోయాను. వాళ్ళు కూడా కాలువలోకి దూకి నన్ను అంతం చేయాలని చూశారు.
తోట త్రిముర్తులపై దాడి చేస్తావా? ఈ రోజుతో నీవు సచ్చావు. అంటూ బూతులు తిట్టారని బాధితుడు రోదిస్తూ చెప్పాడు.
పామర్రు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇశ్రాయేల్ స్నేహితుడు రాజు ఫోన్ చేసి పిలిస్తే తాను వచ్చినట్లు చెబుతున్నాడు. అప్పట్టికే దాడి చేయడానికి కాచుకుని కూర్చున్న రవ్వా నాగభూషణ, అతని అనుచరులు వేట కొడవళ్ళతో విచక్షణారహితంగా నరికినట్లు బాధితుడు చెబుతున్నారు.
మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడిచేసిన ఘటనలో ముఖ్యుడు. కాకినాడ ఆసుపత్రికి తరలించాం. భుజాంపై, తలపై పెద్ద గాయాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.
తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు వెళ్తుండగా కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి త్రిమూర్తులపై చెప్పుతో దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. గతంలో తోట త్రిమూర్తులను వైసీపీలోకి చేరే సమయంలో దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయేలు దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది.
ప్రశాంతమైన తూ.గో.జిల్లా K.గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో మేడిశెట్టి ఇశ్రాయేల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి భౌతికదాడులు సమాజానికి చాలా ప్రమాదం.. సత్వర విచారణ జరిపి నిందితులని అరెస్ట్ చేయాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/katthulatho-daadi-39-98487.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.