వైసీపీ ‘కాపు’రంలో మిగిలేది ముగ్గురేనా?

Publish Date:Sep 18, 2024

Advertisement

వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ కు రాష్ట్రంలో గాలి ఆడటం లేదు.  ఇంత కాలం వైసీపీకి ‘కాపు’ కాసిన నేతలు కూడా దూరం జరుగుతున్నారు. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వీడుతున్నారు.  అలాంటి వారిలో ఇంత కాలం జగన్ కు సన్నిహితంగా ఉన్న వారే ముందుగా బయటకు వస్తుండటం విశేషం.

ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, గుంటూరు జిల్లా కు చెందిన కిలారు వెంకటరోశయ్యలు, జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇరువురూ కూడా వారి వారి నియోజకవర్గాలలో బలమైన నేతలే. ఇరువురూ కూడా జగన్ కు సన్నిహితులుగా ముద్రపడిన వారే. అయితే ఎన్నికల ఫలితాల తరువాత కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వీరు.. ఆ తరువాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ సందర్భంగా వారు జగన్ తీరు పట్ల కొన్ని సునిశిత వ్యాఖ్యలు కూడా చేశారు.

ఇప్పుడు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు. ఉదయభాను వైఎస్సార్ హయాం నుంచి ఆయనకు, ఆయన తరువాత జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి కాంగ్రెస్ నుంచి, ఆ తరువాత రెండో సారి  వైసీపీ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను అప్పటి నుంచి జగన్ పట్ల, వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తిగానే ఉన్నారు.  అయితే జగన్ సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. అదేమిటంటే జనసేనానిని పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయాలని, అయితే అందుకు సామినేని ఉదయభాను అంగీకరించలేదు. దాంతో జగన్ ఆయనను దూరం పెట్టారు.  పవన్ పై ఇష్టారీతిన విమర్శలు, వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోవడానికి రెడీ అయిన పేర్నినాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు. 

ఇప్పుడు సామినేని ఉదయభాను జనసేన గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే సామినేని ఉదయభాను జనసేన నాయకుడు నాగబాబుతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా ఉదయభాను జనసేనలో చేరికను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో  సామినేని ఉదయభానుకు కీలక పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదలా ఉంచితే..కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లే మిగిలేటట్లు ఉన్నారు. వారు వైసీపీకి ‘కాపు’ కాయగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారు తమ నోటి దురుసుతో ప్రజలలో ప్రతిష్ట కోల్పోయారు. 

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.