Publish Date:Mar 28, 2020
సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ గృహ నిర్భంధంలో ఉన్నట్టు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన ఆరోగ్యం గురించి కనుక్కునేందుకు నాన్స్టాప్గా కాల్స్ వస్తుండడంతో కమల్ కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేశారు. వివరాలలోకి వెళితే చెన్నై నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పొరేషన్ అధికారులు కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే 'ఐసొలేషన్' (గృహ నిర్బంధం) స్టిక్కర్ అంటించారు. అయితే, పొరపాటున దీనిని అతికించామని తెలుసుకున్న అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు.
కమల్ ఇంటికి స్టిక్టర్ అంటించిన వార్త కొద్ది నిమిషాలలోనే వైరల్ కాగా, కమల్కి కరోనా సోకిందని, ఆయన ఐసోలేషన్లో ఉన్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై వివరణ ఇచ్చిన కమల్..నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యుడిని. ఆళ్వారుపేటలోని ఇంట్లో గత కొన్నేళ్లుగా నివసించట్లేదు. కేవలం పార్టీ సమావేశాలు నిర్వహించేందుకుగాను పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం. అంతేకాక గృహ నిర్బంధానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు. ముందు జాగ్రత్తగా ప్రజలంతా ఇతరులకు దూరంగా (సోషల్ డిస్టెన్సింగ్) ఉండాలని నేను కోరాను, అదేవిధంగా నా అంతట నేనుగా ఇతరులకు దూరం పాటిస్తున్నాను. న్యూస్ ఎజెన్సీస్ వార్తని ప్రచురించే ముందు నిజనిజలాంటే తెలుసోవాలని '' అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ రెండు వారాల కిందట ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముంబైలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షర చెన్నైలోనే మరొక ఇంట్లో నివసిస్తున్నారు. కమల్ హాసన్ వేరొక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamal-haasan-condemn-coronavirus-rumours-39-96397.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.