గొప్ప విలువలకు పట్టంగట్టిన కారా మాస్టారు

Publish Date:Nov 4, 2024

Advertisement

కథా రచనలోనూ, నిజజీవితంలోనూ కాళీపట్నం రామా రావు మాస్టారికి గొప్ప విలువలు ఉన్నాయి. వాటిని ప్రతి వ్యక్తి అలవర్చు కోవాలి.  శ్రీకాకుళం సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శత జయంతి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ఎచ్చెర్ల) ఉప కులపతి కె.ఆర్. రజని పాల్గొన్ని ప్రసంగించారు.  అక్షరమే దైవంగా భావించిన కారా మాస్టారి జీవితం, చేసిన రచనలు ఎన్నటికీ ఆదర్శనీయమని రజజని అన్నారు. జ్ఞానం, విజ్ఞత, విలువలు, ధీరత్వం వంటి సుగుణాలు కారా మాస్టారు నుంచి నేటి తరం గ్రహించాలని, ఇవి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాలన్నారు. తల్లి లాంటి మాతృభాషా పరిరక్షణకు, అందులోని రచనలను భావితరాలకు అందించేందుకు కృషి జరగాలని సూచించారు.  

మాజీ  ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం ప్రభావంతో రచయితలకు కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతు న్నారని, తెలుగు వారు విడిపోతున్నారని అన్నారు. ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ కారా లాంటి కథకుడు లేరని, తన జీవిత సార్థకతకు కొన్ని నియమాలను ఆయన పెట్టుకున్నారని చెప్పారు. ఎవరూ చెప్పని గొప్ప విషయాలు సాహిత్యం చెప్పిందని భావించి సాహిత్యానికి అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి కారా మాస్టారు అని కొనియాడారు. ప్రకృతి నియమాలు, సమాజ నియమాలు పాటించాలన్న నియమాన్ని ఆయన  జీవితాంతం ఉల్లంఘించలేదని తెలిపారు. రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగ నాథం మాట్లాడుతూ సమాజంలోని సమస్యల మూలాలను తెలుసుకోగలిగితే మంచి కథలు రాసి సమస్యలకు పరిష్కారం అన్వేషించ గలమని కారా మాస్టారు చెబుతుండేవారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కథానిలయంను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి రచనలను ప్రపంచానికి పరిచయం చేయడమే కారా మాస్టారుకు మనం ఇచ్చే నివాళి  అన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత చీకటి దివాకర్ మాట్లాడుతూ తెలుగు కథకుల్లో మూడు తరాలు వారికి ప్రతినిధిగా కారా మాస్టారు నిలిచారన్నారు. గోనె సంచులు పట్టుకుని ఊరురా తిరిగి కథలు సేకరించారని అన్నారు. విశ్వసాహితి అధ్యక్షులు పొన్నాడ వరాహ నరసింహులు, సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షులు కె.శ్రీనివాస్, కారా మాస్టారి కుమారుడు కె.సుబ్బారావు, గరిమెళ విజ్ఞాన సమితి అధ్యక్షుడు వి.జి.కె.మూర్తి తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ప్రత్యేక సదస్సు జరిగింది.

కారా మాస్టారు రచనలు, కథలపై రచయితలు, ఉపాధ్యాయులు దుప్పల రవికుమార్, కంచె రాన భుజంగరావు, మల్లిపురం జగదీష్, డా. కె. ఉదయ్ కిరణ్, ఎ.మోహనరావు, బాడాన శ్యామలరావు, బాల సుధాకర మౌళి, చింతాడ తిరుమలరావు, పూజారి దివాకర్ పత్ర సమర్పణ చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ శత జయంతి కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, భాషాభిమా నులు, అనుచరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.