Publish Date:May 15, 2023
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అక్కడి విజయంతో ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నిండుకుంది. దీంతో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఉత్సాహంతో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలున్నాయి.
అయితే ఇతర పార్టీల్లోని అసంతృప్తవాదులకు ఓ ఆప్షన్ గా కాంగ్రెస్ మారింది. దీంతో భారీ స్థాయిలో ఆ పార్టీకి సభ్యత్వం నమోదు కావడంతో పాటు కొంత మంది కీలక నేతలు గాంధీభవన్ మెట్లెక్కే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావ్ లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అయితే కొన్నాళ్ల నుంచి వీరిద్దరు ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్దంలో ఉన్నారు. బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం బాగా జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరూ బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. బిఆర్ఎస్ కి ప్రధాన శత్రువు బిజెపి కాబట్టి వీరిరువురు చేరికలపై రకరకాల రూమర్లు వచ్చాయి.
అయితే కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ లోనే చేరడం బెటర్ అని ఇద్దరు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకోవడం పైగా ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కు బలం ఉండడంతో.. వారిద్దరు కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ లో చేరడానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో వారు సేవ్ వనపర్తి ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. అదే విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే వాస్తవానికి పొంగులేటి బీజేపీలోకి చేరాలని భావించారు. దీంతో ఆయన బీజేపీ చేరికల కమిటీతో రెండు మూడు సార్లు భేటీ కూడా అయ్యారు. ఆయన ఇంటికి ఈటల బృందం వెళ్లింది కూడా. అయితే ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లోకే ఆయన్ని చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి అప్పుడు ప్రకటించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంతో ఆయన కాంగ్రెస్ లోకే వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాగా, ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లోకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jupally-39-155323.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.