జంతర్ మంతర్ వద్ద విధ్వంసం.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం.!

Publish Date:Aug 5, 2026

Advertisement

 

జంతర్ మంతర్  వద్ద భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ  ఐఎస్ఐ  పన్నిన కుట్రను పంజాబ్ పోలీసులు  ఛేదించారు.  పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో కుట్రకు రూపకల్పన జరిగింది. పంజాబ్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ లో ఈ కుట్రలో భాగంగా ఉన్న   నలుగురు మైనర్ బాలురు సహా   తొమ్మిది మందిని  పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు  పిస్టళ్లు, నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులు, తొమ్మిది రౌండ్ల   తూటాలను స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన ఐఎస్ఐ హ్యాండ్లర్లు సోషల్ మీడియా ద్వారా స్థానిక యువతను ఉగ్ర కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకుని దాడి చేయడమే  లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా రాజాసాన్సీ ప్రాంతానికి చెందిన సుఖ్‌మన్ సింగ్ (19) అనే యువకుడు ముగ్గురు బాలురతో కలిసి ఐఎస్ఐ  ఆదేశాల మేరకు ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతా దళాలు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన నిఘా, బారికేడ్లు కారణంగా వారు కుట్ర అమలు చేయలేక పంజాబ్‌కు తిరిగి వచ్చేశారు.  

  ఈ దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు,  సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్‌సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది. రైలు మార్గాల వద్ద రికార్డవుతున్న కీలక దృశ్యాలను ఈ నిందితులు నేరుగా విదేశాల్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ విచారణలో భాగంగా తరన్‌తారన్‌కు చెందిన వంశ్ కుమార్ (19), అన్మోల్ సింగ్ అలియాస్ సాహిల్ (20), అమృత్‌సర్‌కు చెందిన హర్మన్ సింగ్ అలియాస్ హమ్ము (24), సుఖ్‌దేవ్ సింగ్ (30), సుఖ్‌మన్ సింగ్ (19)లతో పాటు నలుగురు బాలురను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఉగ్ర మాడ్యూల్‌కు అవసరమైన ఆర్థిక లావాదేవీలు అమృత్‌సర్ సెంట్రల్ జైలు నుంచి నడిచాయి. అక్కడ విచారణ ఖైదీగా ఉన్న సుఖ్‌దేవ్ సింగ్ (30), తన సహ ఖైదీ హర్మన్ సింగ్ సూచనల ప్రకారం  Paytm ద్వారా డబ్బులు పంపినట్లు ఆధారాలు లభించాయి. రైల్వే పట్టాల వద్ద కెమెరాల ఏర్పాటుకు కావలసిన నిధులను జైలు నుంచే నిర్వహించడంతో ఆ ఇద్దరు ఖైదీలను పోలీసులు ప్రొడక్షన్ వారెంట్‌పై అధికారికంగా అరెస్టు చేశారు.  

Jantar Mantar terror plot, Punjab Police ISI terror module, Pakistan ISI handlers, Delhi terror attempt, Punjab terror arrests 2026, Amritsar jail Paytm terror funding

By
en-us Political News

  
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
 ఈ సోదాలు బీహార్ కు  చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్,  విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన  నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు,   అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. 
947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై  మంగళవారం ) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం  అంపోలు జైలుకు తిరిగి తరలించారు.
హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది. అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.