అసెంబ్లీ బహిష్కరణ.. జగన్ సెల్ఫ్ గోల్!

Publish Date:Nov 12, 2024

Advertisement

ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్ కాట్ చేయాలని  జగన్ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా సెల్ఫ్ గోల్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కార్ చేసిన తప్పులను తెలుగుదేశం కూటమి సభ్యులు అసెంబ్లీలో ఎండగడతారన్న భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  కేవలం ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం వైసీపీ భవిష్యత్ ను అంధకారం చేయడం ఖాయమని అంటున్నారు.  బడ్జెట్ ప్రసంగాల ద్వారా అధికార పార్టీ తప్పులు, బడ్జెట్ లో జరగని కేటాయింపుల పై నిలదీతకు వచ్చిన అవకాశాన్ని వైసీపీ చేజేతులా జారవిడుచుకుందని అంటున్నారు.  

ప్రతిపక్ష హోదా ఇస్తామని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ,తమకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలనీ, ఆ విషయాన్ని స్పీకర్ చేత చెప్పించాలని వైసీపీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తరువాత అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విపక్ష హోదా గురించి చేసిన ప్రసంగాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు విపక్ష నేతగా ప్రతిపక్ష హోదా అడిగేందుకు తనకు ఏ మాత్రం అర్హత లేదన్న విషయం జగన్ కు అర్ధమౌతుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.   అసలు 11మంది సభ్యులున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిబంధన ఎక్కడుందో చూపాలని జగన్ నిలదీయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.  

అదీ కాక శాసన సభకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు శాసనమండలికి హాజరవడం ఆ పార్టీ ఒక పద్ధతీ పాడూ లేని విధంగా వ్యవహరిస్తోందనడానికి నిదర్శనంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అసలు అసెంబ్లీ అంటేనే శాసనసభ, శాసనమండలి కదా..  బడ్జెట్ సమావేశాలకు శాసన సభను బహిష్కరించి మండలికి హాజరవడం వైసీపీ రాజకీయ అజ్ణానానికి నిలువెత్తు నిదర్శనంగా తెలుగుదేశం కూటమి అభివర్ణిస్తోంది. 

శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామనడం ప్రజాస్వామ్య వ్యవస్థ లో తప్పు అవుతుంది. ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరి ఇలానే కొనసాగితే తమపై అనర్హత వేటు పడుతుందని  భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ,అధికారం కోల్పోయినప్పుడు జగన్ ఒంటెద్దు పోకడలో మార్పు లేదని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా అసెంబ్లీకి ముఖం చాటేసి రేపు ప్రజలు ముందుకు ఏ ముఖం పెట్టుకువెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం 10 శాతం సభ్యులున్న పార్టీలకే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది పట్టించుకోకుండా విపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ బహిష్కరణ అని భీష్మించడం వల్ల అభాసుపాలు కావడం వినా మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని బడ్జెట్ సమావేశాలకు హాజరై గౌరవాన్ని కాపాడుకుంటే పార్టీకీ, ఆయనకూ కూడా మంచిదని హితవు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.