తాడేపల్లి ప్యాలెస్ లో జగన్.. జిల్లా పర్యటనల ఊసేదీ?

Publish Date:Feb 4, 2025

Advertisement

రెండు వారాల విదేశీ పర్యటన అనంతరం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. బెంగళూరు ప్యాలెస్ లో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని సోమవారం(ఫిబ్రవరి 3) ఏపీలో ఎంటరయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. అక్కడ కూడా కొద్ది సేపు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.  

ఆయన ఏపీలో అడుగు పెట్టిన తరువాత ఇక పార్టీ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ, తమ అధినేత ప్రజలలోకి వస్తారనీ ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అసలు పార్టీ వ్యవహారాల ఊసే లేకపోవడం చూస్తుంటే.. ఆయన ఏపీ పర్యటన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అన్నట్లుగా ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు ఆయన జిల్లాల పర్యటన చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అయితే జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫీజు పోరు నిరసన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో గడపడం వినా ఎటువంటి కార్యక్రమాలనూ చేపట్టరన్నది రూఢీ అయిపోయింది.  

గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో వైసీపీ అధినేతగా జగన్ ఓటమిపై సమీక్ష నిర్వహించడం కానీ, ఓటమితో నిరాశ చెందిన నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి చేసిన ప్రయత్నం కానీ లేదు. అసలు ఆయన ఈ ఎనిమిది నెలల కాలంలో ఏపీలో ఉన్నదే తక్కువ. ఆ ఉన్న తక్కువ సమయంలో కూడా అత్యధిక సమయం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించ లేదు.  

అసలు వైసీపీ ఓటమి తరువాత ఒక రాజకీయ పార్టీలా వ్యవహరించిన సందర్భమే లేదు. 2014లో వైసీపీ పరాజయం పాలై ప్రతిపక్షానికే పరిమితమైన సమయంలో జగన్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి కనిపించింది. దాంతో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఆయన సుందరముదనష్ట పాలనను జనం చూశారు. సో ఇప్పుడు ఆయన మాటలను విశ్వసించడానికి కానీ, వినడానికి కానీ వారు సిద్ధంగా లేరు. ఆ కారణంగానే జగన్  జిల్లాల పర్యటనకు పార్టీ నేతలే ఉత్సాహం చూపలేదు. ఏర్పాట్లు చేయలేమనీ, జనాలను తరలించలేమనీ చేతులెత్తేశారు. దీంతో జనంలోకి వెళ్లి భంగపడటం కంటే.. ప్రెస్ మీట్లకు పరిమితమై నిరసన వ్యక్తం చేయడమే మేలన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. 

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.