రక్తికట్టని వైసీపీ డ్రామాలు.. జ‌గ‌న్ లేఖను ప‌ట్టించుకోని పార్టీల అధినేతలు

Publish Date:Sep 24, 2024

Advertisement

తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలో వైసీపీ నేత‌ల డ్రామాలు ర‌క్తి కట్టడం లేదు. త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో డ్రామా ఆడుతున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొద‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రించే వ్యూహాన్నే తిరుప‌తి ల‌డ్డూ విష‌యంలోనూ అమ‌లు చేస్తున్నారు. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో త‌ప్పుచేసిన‌ట్లు ఆధారాల‌తో స‌హా దొరికిపోయినప్పుడు.. జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ప‌దేప‌దే ప్రెస్ మీట్లు పెట్టి అది త‌ప్పుకాదు అంటూ వితండ‌వాదం చేశారు. త‌మ అనుకూల మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేసుకొని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ విష‌యంలోనూ జ‌గ‌న్‌, ఆయ‌న మీడియా ఇదే ఫార్ములాను అనుస‌రించింది. చంద్ర‌బాబు నాయుడే వివేకానంద ఇంటికి వెళ్లి క‌త్తితో దాడి చేశారు అన్న‌ట్లుగా నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ ప్ర‌చారం చేశారు. అంతేకాక‌.. ఓ కులంపైనా త‌ప్పుడు ప్ర‌చారంతో జ‌గ‌న్ దాడి చేశారు. ఆ కులాన్ని కించ‌ప‌రిచేలా, ఆ కులంపై ఇత‌ర కులాల వారిని రెచ్చ‌గొట్టేలా జ‌గ‌న్ అనుకూల మీడియా, సోషల్ మీడాయా ద్వారా  ప్ర‌య‌త్నాలు చేశారు. అలాంటి ప్రచారాల ద్వారానే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. తాజాగా తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలోనూ జ‌గ‌న్ తూచాత‌ప్ప‌కుండా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

 వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యి క‌ల్తీద‌ని ల్యాబ్ రిపోర్టులు స్ప‌ష్టం చేశాయి . 8 జులై 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లు తేలింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన ప‌నితో  ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యారు. ఒక్క ల‌డ్డూ విష‌యంలోనేకాక తిరుప‌తిలోని ప‌లు విష‌యాల్లోనూ వైసీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింది. తాజాగా ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంతో టీటీడీ అధికారులు కొండ‌పై సంప్రోక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు అవ‌శేషాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు మాత్రం వితండ‌వాదం చేస్తున్నారు.

మొద‌టి నుంచీ వారికున్న అల‌వాటు ప్ర‌కారం నిజాన్ని అబ‌ద్ధంగా మార్చేందుకు శ‌త‌ విధాల ప్ర‌య‌త్నాలు చేస్తు న్నారు. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి వైసీపీ ముఖ్య‌నేత‌లంతా మీడియా స‌మావేశాలు పెడుతూ చంద్ర‌ బాబుపై విరుచుకుప‌డ‌తున్నారు. చంద్ర‌బాబు తిరుమ‌ల శ్రీ‌వారిని రాజ‌కీయంగా వాడుకుంటూ.. హిందువుల మ‌నోభా వాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియాలో ల‌డ్డూ వ్య‌వ‌హారం అంతా చంద్ర‌బాబు కుట్ర‌లో భాగ‌మే అన్న‌ట్లు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా ప్రయత్నిం చేందుకు అడ్డ‌మైన దారుల‌న్నీ తొక్కేస్తున్నారు.

 వైసీపీ  హ‌యాంలో టీటీడీ చైర్మ‌న్లుగా ప‌నిచేసిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల వ్య‌వ‌హార‌శైలి మాత్రం ప్ర‌జ‌ల్లో అనుమానాల‌కు తావునిస్తోంది. క‌రుణాక‌ర్ రెడ్డి ఓవ‌రాక్ష‌న్ అయితే తార స్థాయికి చేరిపోయింది. గుమ్మ‌డి కాయ‌ల దొంగ భుజాలు త‌డుముకున్న‌ట్లుగా క‌రుణాక‌ర్ రెడ్డి తెగ కంగారుప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల‌కు వెళ్లి.. తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇక్క‌డ విచిత్రం ఏమిటంటే.. దేవుడంటే ఏ మాత్రం భక్తి లేని.. అన్యమతస్తుడు అయిన కరుణా కరరెడ్డి ప్రమాణం చేశారు. గతంలో తిరుమల శ్రీవారిని నల్లరాయితో పోల్చిన కరుణాకరరెడ్డి ప్రమాణం చేయడమే, తప్పు జరిగిందని అంగీకరించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. తిరుమల వేంకటే శ్వరస్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తిగా  భూమన చెప్పుకుంటారు. కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు, భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అవును  స్వయంగా ఆయనే ఈ మాట అన్నారు. అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ  అవహేళన చేసిన చరిత్ర భూమనకు ఉందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలో  పాత  సంగతులను   గుర్తు చేస్తున్నారు. మ‌రోవైపు ఏపీ ప్రభుత్వం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా పేరున్న పొన్న వోలు సుధాకర్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల ల‌డ్డూను త‌క్కువ చేస్తూ మాట్లాడ‌టంతో శ్రీవారి భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యి ఖరీదు కిలో రూ.320 కాగా.. అందులో రూ.1400 విలువచేసే పంది కొవ్వును ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మార్కెట్‌లో పందికొవ్వు ధర రూ.400 నుంచి రూ.1400 ఉందని చెప్పారు. నెయ్యి కంటే ఖరీదైన వస్తువుతో కల్తీ ఎలా చేస్తారన్నారు. రాగితో బంగారాన్ని కల్తీ చేయవచ్చు కానీ, బంగారంతో రాగిని కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

పొన్న‌వోలు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీ నేత‌ల‌కు తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంపై ఎంత చిన్న‌చూపో   అర్ధ‌మ‌వుతోంది. తాజాగా ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. గ్రామాల్లో అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి. అవి తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి పాలతో చేసే నెయ్యి వల్ల అలా జరుగుతుందంటూ కొత్త లాజిక్ చెప్పారు. వైసీపీ నేత‌ల విచిత్ర వాద‌న‌ల‌తో హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

తిరుప‌తి ల‌డ్డూ వివాదంలో త‌న‌కు ఏమీ తెలియ‌దు.. మేమంతా అమాయ‌కుల‌ం అన్న‌ట్లుగా జ‌గ‌న్, ఆయన పార్టీ నేతల తీరు ఉంది.  త‌ప్పుచేసి అడ్డంగా దొరికిన‌ప్ప‌టికీ త‌న అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ప్ర‌జ‌ల‌ను నిమ్మించ‌డంలో జ‌గ‌న్ మొద‌టి నుంచి దిట్ట‌. అయితే ఇప్పుడు జగన్ పప్పులు ఉడకటం లేదు.   తిరుపతి లడ్డూ వివాదం అంతా చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారమేనని ఆరోపిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి జగన్ లేఖ‌ రాశారు. అంతేకాదు.. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి దేశంలోని అన్ని పార్టీల అధినేత‌ల‌కు ట్యాగ్ చేశారు. ఒక‌ ప‌క్క కేంద్రం గుర్తింపు ఉన్న ల్యాబ్ నుంచే కాక‌.. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయింద‌ని తేల్చింది. జ‌గ‌న్ మెస‌లి క‌న్నీరును గుర్తించిన జాతీయ‌ రాజ‌కీయ పార్టీల  అధినేత‌లు జగన్ ప్రధానికి రాసి సోషల్ మీడియాలో తమకు ట్యాగ్ చేసిన లేఖను లైట్ గా తీసుకున్నారు. తన లేఖ‌  చ‌దివిన వెంట‌నే దేశంలోని రాజకీయ పార్టీల అధినేత‌లంతా స్పందిస్తారు.. ఇక చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెప్పొచ్చు.. చంద్ర‌బాబు బ‌య‌ట‌ పెట్టిన నిజాల‌ను అబ‌ద్దాలుగా మార్చేయ‌వ‌చ్చు అని జ‌గ‌న్ భావించారు. కానీ, జ‌గ‌న్ అంటే జాతీయ పార్టీల నేత‌ల్లో ఎవ‌రికీ న‌మ్మ‌కం లేద‌ని తేలిపోయింది. ఎవరూ జగన్ లేఖను పట్టించుకోలేదు. చివరాఖరికి జ‌గ‌న్‌తో మంచి సంబంధాలు ఉన్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై స్పందించ‌లేదు. దీంతో వైసీపీ నేత‌లు ఉసూరుమంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.