దండుకోవడం, లాక్కోవడంలో జగన్ కు తన పర బేధం లేదు!?

Publish Date:Oct 23, 2024

Advertisement

మా ఇంటికొస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికొస్తే ఏమిస్తావు అనే రకం జగన్. ఆయనకు తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. అయితే ఆ తీసుకోవడం కూడా వాళ్లు ఇస్తే పుచ్చుకోవడంలా కాకుండా.. బలవంతంగా లాగేసుకోవడమంటే మరీ ఇష్టం. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దండుకోవడం అన్న విషయంలో ఆరితేరిపోయిన జగన్ ఆ తరువాత తాను  ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే పంథాలో సాగారు. అలా దండుకునే విషయంలో ఆయనకు తనాపరా బేధం ఉన్నట్లు కనిపించదు. అందుకే ఆస్తుల కోసం, షేర్ల కోసం తల్లి, చెల్లిపై కూడా కోర్టులో కేసులు వేశారు. 

ఇప్పడు ఒక పక్క జగన్ చెల్లి షర్మిలతో సయోధ్య కోసం తండ్రి ఆస్తులలో ఆమెకు రావలసిన వాటాను ఆమెకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారనీ, ఈ మేరకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం నెరిపారనీ, ఆస్తుల పంపకానికి డీల్ కూడా కుదిరిపోయినట్లేననీ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  సరిగ్గా అదే సమయంలో  తల్లినీ, చెల్లినీ ఆస్తుల కోసం, షేర్ల కోసం జగన్ కోర్టుకు లాగారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాను పెట్టిన దాదాపు సూట్ కేస్ కంపెనీ లాంటి ఓ కంపెనీలో షేర్ల కోసం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై కంపెనీ లా ట్రైబ్యునల్ లో కేసు వేశారు. జగ్ ఈ కేసు సెప్టెంబర్ లోనే వేసినా  ఆ విషయం బయటకు తెలియలేదు. ఇప్పుడు ఈ కేసు నవంబర్ లో విచారణకు రానున్న నేపథ్యంలో బయటపడింది.   

వైఎస్ అధికరారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి సరస్వతి పవర్ అనే కంపెనీని కాగితాలపై స్థాపించేసి పల్నాడులో ఆ కంపెనీ పేరు మీద కారు చౌకగా భూములు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ కంపెనీలో తల్లి విజయమ్మ, కుమార్తె షర్మిలకు కొన్ని షేర్లు కేటాయించారు. ఇప్పుడు ఆ షేర్ల కోసమే జగన్ కంపెనీలా ట్రైబ్యునల్ లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. తాను తల్లి విజయమ్మ కు కేటాయించిన షేర్లను ఆమె చెల్లి షర్మిలకు కేటాయించిందనీ, అలా కేటాయించడం అక్రమమనీ పేర్కొంటూ తన షేర్లు తనకు ఇచ్చేయాలంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ సహ పిటిషనర్ గా భారతి కూడా ఉన్నారు.  

ఈ కేసు విషయం వెలుగులోకి రావడంతో జగన్ షర్మిలతో చేస్తున్న రాయబేరాలు, ఆస్తిపంపకాలకు సిద్ధం అవ్వడం వెనుక కూడా ఏదైనా మతలబు ఉందా? కేవలం రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు, తనపై షర్మిల విమర్శల బాణాలు గుప్పించకుండా ఆపి.. ఆ సంధికాలంలో కాంగ్రెస్ తో డీల్ పూర్తి చేసుకునే ప్రణాళిక ఉందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద జగన్ తల్లి, చెల్లిపై షేర్ల కోసం ట్రైబ్యునల్ లో వేసిన పిటిషన్ జగన్ ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. వైఎస్ మరణం నుంచి ఇప్పటి వరకూ జగన్ కు అండగా నిలుస్తూ వచ్చిన వైఎస్ అభిమానులు సైతం జగన్ పై  తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.