బిల్డప్ బాబాయ్!

Publish Date:Jul 30, 2025

Advertisement

కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్. మద్యం కుంభకోణం కేసులో  పీకల్లోతు కూరుకుపోయిన జగన్  రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా..  అబ్బే మనకున్న పరపతి  ముందు  కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.  

మద్యం కుంభకోణం కేసులో  సిట్ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువ అవుతోంది. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. సీట్ తో పాటు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు  ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఏపీ వరకు అంతా తన వెంటే ఉన్నారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. 

 అసలు విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతో పాటు,  లక్షలల మంది అనారోగ్యానికి కారణమని,  లక్షలాది మంది గత ప్రభుత్వంలో,నకిలీ మందు తాగి అనారోగ్యం పాలయ్యారనీ,   వేల మంది జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా  అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారనీ జనం బహటంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నది. కానీ ఇంకొంతమంది వైసీపీ నేతలూ,  మాజీ మంత్రులు అసలు  పిచ్చిమందు, మంచి మందు ఉంటాయా? అంటూ వితండ వాదం చేస్తున్నారు.  సరే అ విషయాన్ని పక్కన పెడితే..  ఇప్పుడు తాజాగా అదే మద్యం కుంభకోణం కేసులో  ఆర్థిక అవినీతి జరిగిందని ,ప్రజల ప్రాణాలతో చెలగాట మాడారని  సిట్ బృందం పక్కా ఆధారాలతో,   నివేదిక తయారుచేసి, ఈ కేసుతో ప్రమేయం ఉన్న   ఒక్కొక్కరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతోంది. ఇక ఈ కేసులో తరువాతి అరెస్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోబోయేదని మాజీ సీఎం జగన్ అని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చేశారు.  ఈ విషయాన్ని బెంగుళూరు ప్యాలెస్ నుంచి నిశితంగా  గమనిస్తున్న మాజీ సీఎం జగన్ , ఎక్కడా తగ్గేదేలే అంటూ రివర్స్ పొలిటికల్  గేమ్ ప్లాన్ చేశారంటున్నారు.  ఆ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి  బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని.. ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి కలిశారు. అంతే కాకుండా జగన్ తాను గవర్నర్ తో భేటీ అయిన విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించారు.  దీంతొ జగన్ ఎందుకు పనిమాలా గవర్నర్ తో భేటీ అయ్యారు? ఈ భేటీలో ఆయన గవర్నర్ తో  చర్చించిన అంశం ఏమిటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అంతే కాదు.. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  ఇలా జరగాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. అంటే ఆయన తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి.  

ఎందుకంటే తనను అరెస్టు చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద విషయం కాదు...  ఓ పక్కన లిక్కర్ కేసు లో  సిట్ అధికారులు కూడా దూకుడు పెంచారు... కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ప్రమేయాన్ని నిరూపించే కొన్ని ఆధారాలు దొరికే ఉంటాయి.   ఇంకొన్నిటి  కోసం సిట్ దర్యాప్తు చేస్తుండి ఉంటుంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేస్తారని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా..    ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని టాక్... అందుకే గవర్నర్ ను కలిసి..  అక్కడ ఏదో జరిగిందన్న బిల్డప్ ఇచ్చి..  ఓ పక్కన ప్రభుత్వానికి మరో పక్కన అధికారులకు ఒత్తిడి పెరిగేలా జగన్ వ్యూహం రచించారనేది పరిశీలకుల విశ్లేషణ.  అందుకే సందర్భం ఉన్నా లేకున్నా, అసలు లోపల ఏం జరిగిందో ? ఏం జరగలేదో తెలియకుండా గవర్నర్ తో  భేటీ అని ఓ పెద్ద వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చారు.  అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి   గవర్నర్ కలిశారు.. అయితే  గవర్నర్ ఆయనకు చేయ గలిగిన  సహాయం ఏంటి?  రాజ్యాంగ పదవిలో  గవర్నర్.. ఆర్థిక నేరాలు, ఇతర అభియోగాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న,  వ్యక్తిని కాపాడగలరా? తనకున్న విశిష్ట, విచక్షణ అధికారాలు ఉపయోగించి, కేసుల్లో ఉన్నా సరే ఒకమాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయొద్దని చెప్పగలరా?  అంటే అదేమీ జరిగే పని కాదంటున్నాయి రాజకీయవర్గాలు.   

అయితే మరి జగన్  గవర్నర్ ఎందుకు కలిశారు? కలిశారు సరే.. ఆ విషయంలో మీడియా అటెన్షన్ ను డ్రా చేసేలా ఎందుకు వ్యవహరించారు?.. అన్న ప్రశ్నకు,  అదే అసలు కామెడీ అంటున్నారు పరిశీలకులు. తన వెనుక ఏదో శక్తి ఉందనీ,  ఓ పక్కన కేంద్రం,  మరో పక్కన గవర్నర్ జగన్ కు రక్షణగా నిలుస్తారనీ..  రేపు జగన్ ను సిట్ అధికారులు,  అరెస్టు చేస్తే , తెర వెనక పెద్దోళ్ళంతా  జగన్ కు  మద్దతు పలుకుతారన్న బిల్డన్ ఇవ్వడానికే.. అలా బిల్డప్ ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు తన నాయకత్వంపై విశ్వాసం సడలిపోకుండా ఉండాలన్న భావనతోనే  జగన్ గవర్నర్ భేటీ విషయం అంతగా ప్రచారంలోకి వచ్చేలా చేశారని అంటున్నారు.   అందుకే తన వ్యూహంలో భాగంగా, గవర్నర్ ను , ఆరోగ్య కుశల, ప్రశ్నలు వేస్తానంటూ అపాయింట్మెంట్ అడిగి ,ఓ గంట పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసి,  తెర వెనక ఏదో మంత్రాంగం జరిపినట్లుగా బిల్డ్ అప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

లేదంటే ఎవరైనా నేత ఓ గవర్నర్ దగ్గరికి వెళ్లి, తనపై కేసులు పెడుతున్నారని తనను కాపాడాలని అడిగే ప్రయత్నం.. కాదు కాదు ధైర్యం చేస్తారా?  అంటున్నారు. ఢిల్లీ వెళ్లి రావటం,  గవర్నర్ కలవడం ఇలాంటివన్నీజగన్  పొలిటికల్ డ్రామాలో భాగమే అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఏంటో,ఆ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో? 

By
en-us Political News

  
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.