Publish Date:Aug 27, 2022
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో వైసీసీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారట.. వివిధ సర్వే నివేది కలను సమీక్షించిన తర్వాత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లోని అధిక శాతం మందికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న టీడీపీ నేతలకు గాలం వేయడానికి జగన్ స్కెచ్ వేశారట. తన ఇమేజ్ తోనే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని కలలు గన్న జగన్ ఇలా ఎందుకు టీడీపీ నేతల వైపు చూస్తున్నారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్ గాలికి తిరుగే లేదని ఇంతకాలం ఊహల్లో విహరించిన జగన్.. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని గుర్తించక తప్పలేదంటున్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే రీతిలో కళ్లు ఆకాశం వైపు చూసిన వైసీపీ అధి నేతకు ఇప్పుడు బొమ్మ కనిపించి.. దిమ్మదిరిగి.. అవే కళ్లు బైర్లు కమ్మి.. టీడీపీ నేతలకు ఎర వేయడానికి రెడీ అయ్యారంటున్నారు.
ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జనంలో మంచి పట్టు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతలను జిల్లాకు ముగ్గురు, నలుగురు చొప్పున వైసీపీలో చేర్చుకోవాలని జగన్ తహతహలాడుతున్నారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగితే.. వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా.. తాను చూసుకుంటానని తన పార్టీలో చేరితే చాలని టీడీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమా చారం. అయితే.. ఈ పనికి చేసేందుకు వైసీపీ నేతలను కాకుండా తనకు వ్యక్తిగత పరిచయాలున్న ఇతర నేతలను జగన్ ప్రయోగిస్తుండడం గమనార్హం. ఏమాత్రం ఈ సమాచారం లీకైనా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని.. జగన్ తానే స్వయంగా ఈ పని చేసుకుంటున్నారట.
జగన్ చేయించుకున్న సర్వేలో వైసీపీ మునిగిపోతున్నదని, ఇప్పుడున్న సీట్లలో సుమారు వందకు పైనే అడ్రస్ గల్లంతవుతాయని నివేదికల సారాంశంగా ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చేటపుడు స్థానికంగా తప్పకుండా గెలిచే టీడీపీ నేతలను తెచ్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ టీమ్ జగన్ కు సలహా ఇచ్చిందట. అందుకోసం జగనే స్వయంగా టీడీపీ నుంచి నేతల ఆకర్ష్ ప్రారంభించారట. జగన్ నేరుగా రంగంలోకి దిగి, ‘క్యాష్ ఫ్రీ టిక్కెట్ పక్కా’ అంటూ హామీలు ఇస్తున్నారని సమాచారం.
కరోనా అనంతరం జగన్ బండారాన్బి ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో పక్కన చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే సొంత పార్టీ నేతలకు తెలియకుండా తానే స్వయంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న టీడీపీ నేతలను నేరుగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే కొందరు రాయలసీమ టీడీపీ నేతలను జగన్ టచ్ చేశారని సమాచారం.
నిజానికి రాయలసీమ ప్రాంతతో పాటు ప్రకాశంజిల్లా వరకు వైసీపీకి మంచి పట్టే ఉంది. అయితే ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం పసిగట్టిన జగన్ ముందు రాయలసీమలో, ప్రకాశంజిల్లాల్లో చక్కదిద్దితే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడుతుం దని స్కెచ్ వేశారట. అయితే జగన్ ప్రతిపాదనపై కొందరు టీడీపీ నేతలు సరిగా స్పందించ లేదట. దీంతో ఆ టీడీపీ నేతల వారసుల నుండి వత్తిడి తెచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించకుండా ఇలా విపక్షంలోని నేతల కోసం పరుగులు తీయడాన్ని చూస్తుంటే.. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనే అంచనాలు వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-hunt-for-tdp-leaders-25-142745.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.