డిల్లీ వెళ్లేందుకు అదొక సాకు అంతే!

Publish Date:Jul 11, 2014

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆంద్ర రాష్ట్రాన్ని ముప్పతిప్పలు పెడుతున్న తెలంగాణా ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనరు, కానీ స్వంత రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం నిప్పులు చేరుగుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయడానికి చేయగలిగినంతా చేస్తుంటారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని తానే చేస్తున్నట్లు కేంద్రం వద్దకు వెళ్లి రాష్ట్రానికి అన్ని విధాల సహాయం చేయాలని కోరుతుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ, మొగుడుని చితకబాది వీధినపడి ఏడ్చినట్లు, తెదేపా, బీజేపీకి మిత్రపక్షమని తెలిసి ఉన్నప్పటికీ డిల్లీ వెళ్లి దానిపై పిర్యాదులు చేస్తుంటారు.

 

ఇదంతా రాష్ట్ర ప్రజల మెప్పు పొందేందుకా? లేక ఈ వంకతో డిల్లీ వెళ్లి తన సీబీఐ కేసులు మాఫీ చేసుకోవడానికా? లేక నిత్యం ఇటువంటి హడావుడి ఏదో చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికా? అనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమయినప్పటికీ తరచూ ఏదో సాకుతో డిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉంటారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాష్ట్రాభివృద్ధి, పునర్నిర్మాణం కోసం అనేక చర్యలు చేపడుతున్న సంగతి అందరికీ కనబడుతున్నా, ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనబడక పోవడం విచిత్రం. నిన్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఐఐటీ, ఎయిమ్స్, విశాఖ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ పరిశ్రమల ఏర్పాటు వంటివి ప్రకటించడమే కాకుండా, రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన ప్రతీ అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈరోజు పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతున్న గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదింపజేశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి ఆర్ధిక మంత్రిని కలిసి రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని, రాష్ట్రానికి ఉదారంగా ఆర్ధిక సహాయం చేయాలని కోరడం చాలా హాస్యాస్పదం.

 

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా గత యూపీయే ప్రభుత్వం లాగే రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, తప్పకుండా ఆయన వెళ్లి గుర్తుచేసినా అర్ధం ఉంటుంది. కానీ అడగకుండా కేంద్రమే అన్నిటినీ అమలు చేస్తున్నపుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి జైట్లీకి మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? అని ఆలోచిస్తే, ఆయన పర్యటనకు, కేంద్ర మంత్రుల కలవడం వెనుక పరమార్ధం వేరే ఉందని స్పష్టమవుతోంది. తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నా, అది కల్లే అని అందరూ భావించినట్లే, పది సీబీఐ ఛార్జ్ షీట్లు పోగేసుకొన్న జగన్ డిల్లీ వెళ్ళినా అది కేసుల మాఫీకేనని జనాలు అనుమానించడంలో అసహజమేమీ లేదు.

 

ఒకసారి సీబీఐ కేసులు గనుక తిరిగి మొదలయితే ఆయనకు మళ్ళీ కష్టాలు తప్పవు. గనుక బహుశః ఆయన ముందే జాగ్రత్తగా కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లున్నారు. కానీ అవినీతి భూతాన్ని అంతం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనే విస్పష్టంగా ప్రకటించిన నరేంద్ర మోడీ, జగన్ కేసులను ఉపేక్షిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

By
en-us Political News

  
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.