ఒక్క పిటిషను వేస్తే వంద పిటిషన్లు వేసినట్లే

Publish Date:Nov 19, 2013

Advertisement

 

అదేదో సినిమాలో హీరో నేను ఒక్కమారు చెపితే వంద సార్లు చెప్పినట్లే అన్నట్లు, కోర్టు ఒక పిటిషను తిరస్కరిస్తే వంద పిటిషన్లు వేసయినా సరే ఒప్పించుకోగల పట్టువదలని విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డి. దేశమంతటా తిరిగేందుకు అనుమతి కోరుతూ అతను వేసిన పిటిషనును నిన్న సీబీఐ కోర్టు తిరస్కరించగానే, వెంటనే మరో పిటిషను వేసారు. నేరుగా ‘నేషనల్ పర్మిట్’ అడిగితే కోర్టు ఈయదని గ్రహించిన అతను, ఈసారి కోల్ కతా, లక్నో నగరాలు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరుతూ మరో పిటిషను వేసారు. అతను ఊహించినట్లే ఆ రెండు నగరాలకి వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఈరోజు అనుమతి మంజూరు చేసింది. బహుశః ఈ రెండు చుట్టబెట్టి వచ్చిన తరువాత ఒరిస్సా మరియు బీహార్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ మరో పిటిషను వేస్తారేమో!

 

దేశంలో వివిధ కాంగ్రెసేతర పార్టీ నేతలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు మద్దతు కోరేందుకు ఈ యాత్రలని అతను పైకి చెపుతున్నపటికీ, ఈ సాకుతో దేశంలో అన్ని పార్టీల నేతలతో పరిచయాలు పెంచుకొని, అందరి దృష్టిని ఆకర్షించడమే అతని లక్ష్యమని చెప్పవచ్చును. ఒకప్పుడు స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పేరో, తను కూడా ఆవిధంగానే తిప్పుదామని అతని ఉద్దేశ్యం కావచ్చును.

 

అంతే గాకుండా, ఈవిధంగా జాతీయ స్థాయి నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతున్నట్లయితే, కాంగ్రెస్ మళ్ళీ తనపై సీబీఐని కానీ ఈడీని గానీ ప్రయోగించే దుస్సాహసం చేయదనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.

 

కానీ ఈ ప్రయత్నంలో ఒకదానికి మరొకటి బద్దశతృవులయిన పార్టీలని జగన్ కలుస్తుండటం వలన, అతను వారి మద్దతు పొందడం సంగతి ఎలా ఉన్నపటికీ, ముందు అతనిపై అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మొదట అతను లెఫ్ట్ పార్టీలని కలిసిన మరునాడే అవి తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీని కలిసి రహస్య మంతనాలు చేసి వచ్చారు. రేపు అతను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖించే తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని కలువబోతున్నారు. ఆ తరువాత బీజేపీకి బద్దశత్రువయిన సమాజ్ వాదీ పార్టీ నేతలని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ని కలవబోతున్నారు. ఇక వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువులేనని వేరే చెప్పనవసరం లేదు.

 

జగన్ ఎటువంటి సిద్ధాంతాలు చూడకుండా ఈవిధంగా దేశంలో ఉన్న కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను కలవడం ద్వారా తను కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధినని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు గాక. ఈ యాత్రల వలన అతను ఆశిస్తున్న దొకటయితే, ఫలితాలు మాత్రం వేరేలా ఉండే అవకాశాలున్నాయి.

 

అతను ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహమే అతనికి పరాభవాలు మిగిల్చినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినా ఆశ్చర్యం లేదు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ మళ్ళీ తనను జైలుకి పంపే సాహసం చేయలేదని అతని అబిప్రాయం కావచ్చును.

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.