కాంగ్రెస్ తో పొత్తుపై జగన్... మౌనం అంగీకారమేనా?.. రగిలిపోతున్న కమలం

Publish Date:Apr 25, 2022

Advertisement

మామూలుగా మౌనం అర్ధాంగీకారం.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వైసీపీ  అధినేత  జగన్ మౌనంపై మాత్రం బీజేపీ రగిలిపోతోంది. ఆ మౌనం సంపూర్ణాంగీకారమే అని చిర్రుబుర్రులాడుతోంది. రాష్ట్రంలో బలమైన పార్టీని కాదనుకుని 2019 ఎన్నికలలో బీజేపీ పొత్తు లేకపోయినా అన్నిందాలా మద్దతు ఇచ్చిన  సంగతిని గుర్తు చేసుకుని రగిలిపోతున్నది. అంతే కాకుండా అధికారంలో ఉన్న ఈ మూడేళ్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన ఆర్థిక అవకతవకలను సమర్ధిస్తూనో, లేదా చూసీ చూడనట్లు వదిలేసో సహకరించిన కమల నాథులకు ఇప్పుడు వైకాపా రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్త పెట్టుకోవడం మింగుడుపడటం  లేదు. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలపై వైసీపీ నుంచి ఎటుంటి సానుకూల స్పందనా ఇప్పటి వరకూ రాకపోయినా, ఎలాంటి వ్యతిరేక ప్రకటన కూడా చేయకుండా జగన్ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనంపై బీజేపీ గుర్రుగా ఉంది.

ఆ కారణంగానే ఇప్పటి వరకూ ఈ మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై ఓ కన్నేసుంచాలని నిర్ణయించుకుంది. అంతే కాకుండా నిబంధనలను కాదని ఒక్కరూపాయి కూడా అప్పు పట్టకుండా చక్రబంధంలో బిగించేసింది. బీజేపీలోని ఒక వర్గం కథనం ప్రకారం జగన్ కు రాజకీయ ప్రయోజనలంటూ ఏమీ ఉండవనీ, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా ఉంటూ తన కేసుల నుంచి తప్పించుకోవడమే ప్రధాన లక్ష్యం. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలలో అధికారం చేపట్టనున్నది కాంగ్రెస్ అని నమ్మబలుకుతుండటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని బీజేపీ భావిస్తున్నది.

ఇంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంటకాగి, ఇప్పడు కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించడమంటే.. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ సర్కార్ అన్న సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వడమేనని బీజేపీ భావిస్తున్నది. జగన్ కు ఇంత కాలం అండగా నిలిచిన కమలం.. అందుకు ప్రతిఫలంగా రాష్ట్రంలో ఏదో ఒక మేర బలోపేతం కావాలని భావిస్తున్నది. మరో సారి కేంద్రంలో మోడీ సర్కార్ అధికార పగ్గాలు చేపడుతుందన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలలో కలిగించగలిగితేనే అది సాధ్యమౌతుంది. ఇంత కాలం అనధికార మిత్ర పక్షంగా ఉన్న వైసీపీ పక్క చూపులు చూస్తే జనం కేంద్రంలో బీజేపీ పనై పోయిందనీ, అందుకే జగన్ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తోందన్న నిర్ధారణకు వచ్చేస్తారు. అంతే కాదు ఈ ప్రభావం దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. ఎందు కంటే జగన్ కు రాజకీయాలు, అధికారం తనపై ఉన్న కేసుల భయం లేకుండా ఒక కవచంలా వాడుకునేందుకేనని తెలియని వారెవరూ లేరు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా నిలవకుంటే ఇబ్బందులు తప్పవని తెలిసిన స్థిత ప్రజ్ణత జగన్ ఉంది కనుకే ఆయన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని తెలసినా బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. రైతులలో వ్యతిరేకత పెల్లుబుకుతుందని తెలసీ...వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు కేంద్రం కోరడమే తరువాయ ఆమోదం తెలిపేశారు. రైతు లోకం అంతా వ్యతిరేకిస్తోందని తెలిసీ వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికారు. అటువంటి జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు అన్న ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనను వ్యతిరేకించకుండా మౌనంగా ఉండటం, విజయసాయి వంటి నాయకులు పొత్తుకు జగన్ సానుకూలం అనే అర్ధం వచ్చేలా మాట్లాడటం చూస్తుంటే.. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు అవగతమౌతుంది. అదే ఇప్పుడు బీజేపీ గుర్రుకు కారణం అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇక ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ సర్కర్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.