ఒక జగన్ కేసు, రెండు అభిప్రాయాలు
Publish Date:Jan 24, 2013
Advertisement
మనం ఏరంగు కళ్ళద్దాలు పెట్టుకొంటే లోకం కూడా ఆ రంగులోనే కనబడుతుంది. జగన్ మోహన్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి నాటకమాడుతూ బెయిలు దొరకనీయకుండా చేస్తూన్నాయని జగన్ తరపువారు ఆరోపిస్తుంటే, అతనిని కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు అడిగిన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జగన్ వాదన సరయినదనుకొంటే, కోర్టులు ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఈ పాటికే సమన్లు జారీచేసి ప్రభుత్వ సంజాయిషీ కోరుండాలి. గానీ కోరలేదు, అంటే జగన్ నిర్దోషని కోర్టులు కూడా నమ్మకపోవడమేకారణం అనుకోవచ్చును. ఒకవేళ చంద్రబాబు వాదన సరయినదయితే, రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షపార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీయే స్వయంగా ఆ పనికి పూనుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కోర్టులో కేసువేసి సిబిఐకి సమాచారం అందివ్వకుండా జాప్యం చేస్తూ జగన్నిఎందుకు కాపాడుతున్నారని నిలదీయవచ్చును. గానీ తెలుగుదేశం ఆపని ఇంతవరకు చేయలేదు. అంటే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలలోనూ పస లేదనుకోవాలి. ప్రజలకి ఆసక్తి ఉన్న అటువంటి విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయంగా తన ప్రత్యర్దులను విమర్శించడానికే ఉపయోగించుకొంటున్నారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఇంతకీ జగన్ కేసు విషయంలో ఎవరి వాదన సరయినది అని తెలుసుకోవాలంటే ప్రజలే తమకు నచ్చిన రంగుటద్దాలు పెట్టుకొని చూసి తెలుసుకోవాలి.
http://www.teluguone.com/news/content/jagan-24-20603.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





