పీకేకు పరిటాల గుండు కొట్టించారా? చేసిందెవ‌రు? చేయించిందెవ‌రు?

Publish Date:Aug 30, 2021

Advertisement

అది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం. చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా జేజేలు అందుకుంటున్న రోజులు.. చంద్రబాబుకు అంతర్జాతీయంగా ఇమేజ్ వస్తున్న కాలం.. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఓ రేంజ్ లో వెలిగిపోతున్నారు. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ డూపర్ సినిమాలతో టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. అప్పుడు చిరంజీవి ఎక్కడికెళ్లినా లక్షలాది మంది జనం వచ్చేవారు. రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేసేవారు. 

ఆ సమయంలోనే  2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో ఓ బాంబ్ లాంటి వార్త వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, కీలక నేతగా ఉన్న ఓ నేతకు.. సినిమాల్లో సూపర్ హిట్లు కొడుతున్న మెగా ఫ్యామిలీకి  మధ్య గొడవ జరిగినట్లుగా వచ్చిందా వార్త. కాంగ్రెస్ పార్టీకి కరపత్రంగా ఉండే అప్పటి రాజ్యసభ సభ్యులు తిక్కవరపు వెంకట్రామిరెడ్డికి చెందిన  డెక్కన్ క్రానికల్ పత్రిక.. మంచి మసాలా దట్టించి ప్రచురించింది ఆ కథనాన్ని. మెగా కుటుంబానికి  చెందిన హీరో ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌న్న ఆ వార్త.. అప్పట్లో సంచలనమైంది. 

పరిటాల రవి పేరు చెబితేనే అప్పుడు అంతా గజగజలాడేవారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారు పరిటాల. పేదల పాలిట పెన్నిదిగా ఎదిగారు. పీపుల్స్ వార్ భావజాలంతో ఎదిగిన పరిటాల రవి.. పేదల కోసమే పని చేశారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకే ఆయనకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. జనాల గుండెల్లో పరిటాల ఎంతగా నిలిచిపోయారంటే.. ఆయన హత్యకు గురై 16 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికి ఆయన జయంతి, వర్థంతి రోజున వెంకటాపురంలోని ఆయన సమాధి వద్దకు లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి నివాళులు అర్పిస్తారు. రాబిన్ హుడ్ లా ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన పరిటాల రవికి.. మెగా హీరో కుటుంబానికి గొడవ ఉందన్నట్లుగా వచ్చిన ఆ డెక్కన్ క్రానికల్ కథనం పెను సంచలనమైంది. రాజకీయాలను షేక్ చేసింది. 

ఇంత‌కీ ఆనాడు అస‌లేం జ‌రిగింది? పీకేకు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించారా? ఎందుకు కొట్టించారు? వారిద్ద‌రికీ గొడ‌వ జ‌రిగిన మాట నిజ‌మేనా? అనుకోకుండా అలా ర‌చ్చ జ‌రిగిందా? లేక‌  కావాల‌నే వివాదం సృష్టించారా? ఇంత‌కీ ఆ ప్రొప‌గాండ చేసిన వారి టార్గెట్ ప‌వ‌న్‌క‌ల్యాణా? ప‌రిటాల ర‌వినా? లేక‌, చంద్ర‌బాబు నాయుడా? అప్ప‌టి ఇంట్రెస్టింగ్ పొలిటిక‌ల్ లిటిగేష‌న్.. ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది.

మెగాస్టార్ చిరంజీవీతో పాటు 2003లో వ‌రుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. స‌డెన్‌గా ఓ రోజు టీవీల్లో థ‌మ్స్అప్ యాడ్‌లో గుండుతో క‌నిపించారు పీకే. అంతే ఒక్క‌సారిగా అంతా షాక్‌. అదేంటి.. ప‌వ‌ర్ స్టార్ ఏంటి.. గుండు చేయించుకోవ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌య్యారు. క‌ట్ చేస్తే.. ప‌రిటాల ర‌వితో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొడ‌వ ప‌డ్డార‌ని.. అందుకే ప‌రిటాల పీకేకి గొండు కొట్టించార‌ని.. ఆ గుండు ర‌వి చేయించిందేనంటూ డెక్కన్ క్రానికల్ లో  కొన్ని రోజుల తర్వాత వార్త వ‌చ్చింది. ప‌రిటాల‌-చిరంజీవి మ‌ధ్య ఓ ల్యాండ్ మేట‌ర్‌లో వివాదం నెల‌కొన‌గా.. పీకే జోక్యంతో విష‌యం గుండు వ‌ర‌కూ దారి తీసిందంటూ.. దిట్టంగా మ‌సాలా ద‌ట్టించి.. వండి వార్చింది. ఆ న్యూస్‌తో అంతా షేక్‌. పీకే గుండుకంటే.. క‌ల్యాణ్‌బాబును ప‌రిటాల ర‌వి కొట్టించాడ‌ని, గుండు కూడా చేయించాడ‌నే న్యూస్ తెగ వైర‌ల్ అయింది. యావ‌త్ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ టాపిక్‌పై చ‌ర్చ..ర‌చ్చ‌ జ‌రిగింది. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్  ఆనాటి గుండు ఎపిసోడ్‌పై పరిటాల రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కాని నిజం కంటే అబద్దాన్నే జనాలు తొందరకు నమ్మేస్తారన్నట్లుగా.. పీకే గుండు విషయంలోనూ అబద్దమే ఎక్కుగా ప్రచారమైంది. ఆ తర్వాత ఆ గుండు మేట‌ర్ వెనుక అస‌లు సూత్ర‌ధారి, పాత్ర‌ధారి వేరే ఉన్నార‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదంతా అప్పటి కాంగ్రెస్ నేతలు.. పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ మీద, చంద్ర‌బాబు మీద చేయించిన‌ కుట్ర‌, కుతంత్ర‌మ‌న్న సంగ‌తి తేలింది. 

పరిటాల రవీంద్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కమ్మ కులానికి చెందిన వారు కాగా.. పవన్ కల్యాణ్ కాపు కులానికి చెందిన వారు. 1988లో జరిగిన వంగవీటి హత్య తర్వాత కాపులంతా టీడీపీకి దూరమయ్యారు. నిజానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత కాపులంతా ఆయన వెంటే నిలిచారు. కాపుల సంపూర్ణ మద్దతు వల్లే 1983,85లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. అందుకే టీడీపీకి కాపులను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే వంగావీటి రంగా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కుట్రలో భాగంగానే 1988 తరహాలోనే  రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య కక్షలు భగ్గుమనేలా చేయాలనే కుట్రలో భాగంగానే .. ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌నే కథనాన్ని అప్పుడు కాంగ్రెస్ ఎంపీకగా ఉన్న వెంకట్రామిరెడ్డికి చెందిన డెక్కన్ క్రానికల్ లో ప్రచురించారు.  

1988  టీడీపీకి దూర‌మైన కాపులు.. నిజం తెలుసుకున్న తర్వాత  1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి మద్దతుగా వచ్చారు. 1995లో చంద్ర‌బాబు సీఎం అయ్యాక..  సీబీఎన్ ప‌రిపాల‌న‌ ద‌క్ష‌త చూసి.. కాపు వ‌ర్గం టీడీపీకి బ‌ల‌మైన‌ మ‌ద్ద‌తుదారులుగా మారారు. ఆ అభిమానం అలా కొన‌సాగుతూనే వ‌చ్చింది. దీంతో టీడీపీకి ద‌న్నుగా ఉన్న కాపుల‌ను ఆ పార్టీ నుంచి దూరం చేయాల‌ని క‌న్నింగ్ స్కెచ్ వేశార‌ట అప్పటి కాంగ్రెస్ నేతలు. అందుకు పావుగా..  అప్పుడు సినిమాల్లో మంచి హిట్ లు కొడుతున్న.. కాపుల‌కు రోల్‌మోడ‌ల్‌గా ఉన్న మెగా ఫ్యామిలీని వారి ప్ర‌మేయం లేకుండానే వాడేసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ వారికి, మెగా బ్ర‌ద‌ర్స్‌కు గొడ‌వ‌లున్నాయ‌నే ప్ర‌చారం రేపి.. కాపులను తెలుగుదేశానికి దూరం చేయాల‌నే ప‌న్నాగం ప‌న్నార‌ట‌. అందులో భాగంగా.. గ‌తంలో ఎప్పుడో గుండుతో క‌నిపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను.. కొత్తగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారట. 

అప్పటి కాంగ్రెస్ పెద్దల పక్కా ప్లాన్ లో భాగంగానే పీకే గుండుకు మ‌సి పూసి మారేడు కాయ చేశారు. ఆనాటి పీకే గుండుకు.. ప‌రిటాల ర‌వినే కార‌ణ‌మ‌ని.. లేని వివాదాన్ని కొత్త‌గా సృష్టించారు. అప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌స్తావించ‌ని ఆ క‌థ‌ను.. వ్యూహాత్మ‌కంగా.. త‌న ప్ర‌ధాన అనుచ‌రుడి ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నంగా వ‌చ్చేలా చేశారు. అంతా కలిసి పీకే గుండుపై అగ్గిపుల్ల గీచి.. ప‌రిటాల ర‌విపై ప‌డేశారు. ఆ మంట‌పై  కాంగ్రెస్ నేత అనుచ‌ర‌వ‌ర్గ‌మంతా త‌లా ఇంత పెట్రోల్ చ‌ల్ల‌డంతో.. అది భ‌గ్గున మండి.. పెద్ద రాజ‌కీయ ర‌చ్చే రాజుకుంది. పవన్ కు అవమానం జరిగితే.. మెగా అభిమానులైన కాపులు తమకే అవమానం జరిగినట్లుగా ఫీలై.. టీడీపీపై ర‌గిలిపోయి, ఆ పార్టీకి దూర‌మ‌వ్వాల‌నేది ఆనాటి కాంగ్రెస్ పెద్దల స్కెచ్‌. పొలిటిక‌ల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ క‌ల్పిక అబాంఢానికి.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌ల‌న్నీ ఆనాటి కాంగ్రెస్ పెద్దలే వ‌హించార‌ని చెబుతారు. వైఎస్సాఆర్ ప్రధాన అనుచరుడిగా ఉంటూ, మీడియాలో తెగ హడావుడి చేసే ఓ నేతే కనుసన్నల్లోనే ఇదంతా నడిచిందని అంటారు. 

త‌న‌కు, ప‌రిటాల ర‌వితో ఎలాంటి గొడ‌వా లేద‌ని, త‌న గుండుకు ర‌వికి ఎలాంటి సంబంధం లేద‌ని..  2018లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వయంగా బ‌య‌ట‌పెట్టారు. ఆ విష‌యం ప‌రిటాల సునీత‌కు పీకేనే స్వ‌యంగా వివ‌రించార‌ు. ఆగ‌స్టు 30 ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఆనాటి పీకే గుండు వివాదం తాజాగా చ‌ర్చ‌కొచ్చింది. రాజకీయ లబ్ది కోసమే నాయకులు.. కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ఎలాంటి కుట్రలు చేశారో తెలుసుకోవడానికి పరిటాల రవీంద్ర, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఉదాహరణగా నిలుస్తోంది.. 

By
en-us Political News

  
అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు.
తిరుమలలో అగ్రిప్రమాదం సంభవించింది. అయితే అటవీ ప్రాంతంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.. ఒక్క మంత్రి వర్గ విస్తరణ విషయంలోనే కాదు.. ఆయన అసంతృప్తికి ఇంకా చాలా కారణాలున్నాయి. అయితే.. రోజు రోజుకు అధిష్టానంతో పెరుగతున్న దూరం విషయంలో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పెరుగతున్న దూరం విషయంలో ఆయన కొంత మధన పడుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ( జూన్ 9) హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను తొలుత విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అమరావతిపై, అమరావతి మహిళలపై జగన్ మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మీడియాలో ఓ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఖండించకుండా వత్తాసు పలికిన ఆ మీడియా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది.
ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అందులోనూ గుంటూరులో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికలకు ముందు వరకూ గుంటూరు జిల్లాలో వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. ఆ సమయంలో మనోహర్ నాయుడు కూటమి పార్టీలను, అందులోని నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు.
సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు.
జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
అమ‌రావ‌తిపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులె ఆయన దాఖలు చేసుకున్ని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.