డ్యూటీ విత్ డెమోక్రసి

Publish Date:Sep 15, 2021

Advertisement

సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఈ ప్రజాస్వామ్యం అనే పదంలోనే ప్రజలు ఇమిడిపోయి ఉన్నారు. 

ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారని అబ్రహం లింకన్ నిర్వచించారు.

అట్లాగే భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే ప్రజలు మాత్రం దానికి అనుగుణంగా ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే మరి. 

ప్రజల చేత….
ప్రజల కొరకు…
ప్రజలే ఎన్నుకోవడం……

పై మూడు పదాలను మళ్ళీ మళ్ళీ చెడితే అర్ధమయ్యే విషయం ప్రజలకు దేశం గూర్చి బాధ్యత ఉండాలని. కానీ ఈ దేశంలో బాధ్యాతాయుత పౌరులు ఎందరు అన్నది ప్రశ్నార్థకం. ఇది ఒక మనిషినో, ఒక సమూహన్నో, ఒక సంఘాన్నో, ఒక సమాజాన్నో కాకుండా యావత్ భారతీయులందర్ని అడగాల్సిన ప్రశ్న మరి. 

అసలు బాధ్యత అంటే ఏమిటి??

ఇల్లు, ఇంట్లో కుటుంబ సభ్యులు. వాళ్ళు అందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు, అలా ప్రతి రోజు పనులు చేస్తూ ఉంటారు. అమ్మ వంట చేస్తుంది, నాన్న సంపాదించుకొస్తాడు, పిల్లలు చదువుకుంటారు, ఆడపిల్లలు ఇంట్లో పనులు చేస్తుంటారు, మగపిల్లలు బయటకెళ్లి చేయాల్సిన పనులు చేస్తారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతారు. ఇదంతా ఇంట్లో ఉన్న మనుషుల బాధ్యత. మరి ఇలాంటి బాధ్యత సమాజం విషయంలో, దేశం విషయంలో అక్కర్లేదా??

రోజు ఇంట్లో పనులు చేస్తుంటే పడక గది నుండి, వంట గది దాకా అన్ని చోట్లా నుండి చెత్త పొగవుతుంది. పొడి చెత్త తడి చెత్త కూడా. వాటిని అట్లాగే రోజుల తరబడి ఇంట్లో ఉంచుకుంటే ఇల్లంతా దుర్గంధమే. ఈ విషయం మనకు తెలుసుం అందుకే చక్కగా దాన్ని తీసుకుపోయి ఇంటికి అవతల లేదా వీధి చివర వేస్తాం. దాన్ని అక్కడ శుభ్రం చేయకపోతే వీదంతా కంపు గొడుతుంది. కానీ నాకెందుకు అని పట్టించుకోమ్. అట్లాంటి బాధ్యత రహితాలే క్రమంగా  పెరిగి దేశం పట్ల కూడా బాధ్యతా రహితంగా ఉంటున్నారు నేటి జనం. 

మనిషి తన పని కోసం ఎంత నిజాయితీగా, క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తాడో అలాగే తనకున్న బాధ్యత విషయంలో సమాజం పట్ల, దేశం పట్ల కూడా స్పందించగలగాలి. 

కేవలం ప్రభుత్వ విషయానికే ప్రజాస్వామ్యం అనేది వర్తిస్తోందని అనుకోవడం మూర్ఖత్వం. దేశం మీద ప్రజలకు ఉన్న బాధ్యతను గుర్తు చేసుకుంటే దేశంలో ఎన్నో పరిస్థితులలో మార్పులు చాలా సులువు అవుతాయి.

ప్రజాస్వామ్యం గురించి తమ బాధ్యతల గురించి ప్రతి మనిషి తమలో తాము డెమో నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని గ్రహించి ఇప్పుడే మొదలుపెడితే.

ముందు వచ్చేది ఆరోగ్యకరమైన మార్పే!! అదే అసలైన ప్రజాస్వామ్యం అవుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ


 

By
en-us Political News

  
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.