ఔరంగజేబు జీవితంలో ఆసక్తికర విషయం!!

Publish Date:Dec 13, 2022

Advertisement

మొగల్ పాదుషా ఔరంగజేబు కఠినమైన మనిషని చరిత్రలో చదువుతుంటాం. కానీ ఈ కాఠిన్యం ఇతరుల విషయంలోనే కాకుండా, తన విషయంలో కూడా అంతే కఠినంగానూ ఉండేవాడు. మతవిధుల్ని తు.చ. తప్పకుండా అమలు జరుపాలనే విషయంలో చాలా నిక్కచ్చిగా వుండేవాడు. తన స్వంత ఖర్చు కోసం ఖజానాలోని డబ్బు ముట్టుకొనేవాడు కాదు. ప్రార్థన వేళల్లో ముస్లిములు శిరస్సుపై ధరించే టోపీలు, కోరాన్ గ్రంథం కాపీలు తయారు చేసి వాటి అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. ప్రవక్త, దేవుడు వీరిద్దరి యెడల అతడి భక్తి అపారం. 


తను నివసించే ప్రాంతంలోని వారంతా ఒకచోట చేరి భగవత్ ప్రార్థనలు జరిపితే బాగుంటుందని అతడికో ఆలోచన తట్టింది. ఎంతోమంది ఒక్కచోట చేరి ఏకహృదయంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే చూడముచ్చటగా వుంటుందని అనిపించింది. దానికోసం పెద్ద మసీదును ఒకదాన్ని నిర్మింపజేసాడు. ప్రార్థన చేపే ఒక్కొక్కరికి ఒక్కో నలుచదరపు గడి ఉండేట్లుగా ఏర్పాటు చేయించాడు. మిగతా అందరితో బాటు తాను కూడా ప్రార్థన వేళకు అక్కడ హాజరయేవాడు. అంతా వస్తున్నారా? అందరూ ఈ ఏర్పాట్లు చూసి సంతోషిస్తున్నారా? అని కనుక్కుంటుండేవాడు. అందరు వస్తున్నారు కానీ, మసీదు పక్కనే నివసించే ఒకతడు మాత్రం రావడం లేదని చెప్పారు పనివారు. 


 “ఎవరా మనిషి? నేను చేసిన శాసనం తెలియదా? అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థించాలనే నా ఆకాంక్ష అతడికి తెలియజేయలేదా?” అన్నాడు.


 "తెలియజేశామండీ, కానీ పట్టించు కోకుండా ఆ వీధుల కూడలిలో అలాగే కూచుంటాడండీ" అని సమాధాన మిచ్చారు వాళ్ళు.


"మసీదుకు ప్రార్థన సమయంలో వచ్చి తీరాలనే నా ఆజ్ఞ అతడికి తెలియజేయండి” అన్నాడు పాదుషా.


 పాదుషా వారి ఆజ్ఞ అని చెప్పామండీ. ఎంతో వేడుకున్నాము. కానీ కదలడండీ." అన్నారు పనివారు.


"అయితే బలవంతంగా పట్టుకురండి” అన్నాడు  పాదుషా. 


ఆ మర్నాడు అతన్ని బలవంతంగా మసీదుకు పట్టుకువచ్చి ఒక నలచదరపు గడిలో నుంచోబెట్టారు. అలా నుంచోనుండగా అక్కడున్న మిగతా వారందరూ మోకాళ్ళమీద వంగి ప్రార్థనలు చేస్తున్నారు. చక్రవర్తి కూడా ప్రార్థిస్తున్నాడు. మసీదులోని ముల్లా ఎలుగెత్తి ప్రార్థన ప్రారంభించాడు. ఇటువంటి పవిత్ర వాతావరణంలో, ఈ బలవంతం మీద వచ్చిన మనిషి హఠాత్తుగా పెద్ద పెట్టున అరిచాడు. “నీ తుచ్ఛమైన దైవం నా పాదాలకింద ఉన్నాడు" అని వెర్రికేక పెట్టి ఆ మసీదు నుండి విసురుగా నడుస్తూ వెళ్ళిపోయాడు. భక్తులు నివ్వెరపోయారు. సాక్షాత్తూ పాదుషా కూడా వారి మధ్యనే ఉన్నాడు. ఎంత అపచారం జరిగిందనేది అందరూ కళ్లారా చూశారు, చెవులారా విన్నారు.


ప్రార్థన పూర్తయిన తర్వాత పాదుషా తన మంత్రులను పిలిచి "అరిచిందెవరో, ఆ దైవ ద్రోహిని ఉరి తీయించండి" అని ఆదేశించాడు. అలా అరిచిన వ్యక్తిని ఉరితీసారు. 


కానీ ఆనాటి నుండి ఔరంగజేబు మనసు హాయిగా వుండేది కాదు. తానే అపరాధం చేశానేమో అన్నట్లు బాధపడుతుండేవాడు. ఒకనాడు మంత్రుల్ని పిలిచి ఆ మసీదు వద్దకు పోయివద్దాం పదండి. ఆ మసీదులో నుంచోనుండగా ఆ వ్యక్తి అలా వెర్రికేక పెట్టటానికి ఏదో బలమైన కారణముండి వుండాలి అంటూ దారి తీసాడు. మసీదువద్దకు వెళ్ళి, ముల్లాను పిలిపించి "నిజంచెప్పు. సంకోచించవద్దు. నీవు ఆనాడు ప్రార్థన చేసే సమయంలో ఆ వ్యక్తి అలా దురుసుగా కేక పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ ప్రార్థన వేళలో నీ మనస్సు సంపూర్తిగా అల్లామీదనే వుండేనా?” అని అడిగాడు.


 అందుకు సమాధానంగా ఆ ముల్లా "ప్రార్థన ప్రారంభించేప్పుడు మనసు దేవుడు మీదనే లగ్నమై వుండెనండీ, కాని కొద్ది సేపట్లోనే నా మనసులో ఒక రకమైన ఆలోచన మెదిలింది. చక్రవర్తి ఇక్కడే వున్నారు కదా మరింత గట్టిగా ప్రార్థన సలిపితే పాదుషా సంతోషిస్తారు. నా కూతురు వివాహం తలపెట్టినప్పుడు పాదుషాను అభ్యర్థిస్తే డబ్బు సులభంగా మంజూరవుతుంది" అనే ఆలోచన వచ్చింది.


పాదుషాకు ఛట్టున ఏదో స్ఫురించి "ఆ మనిషి నుంచున్న గడి క్రింద తవ్వి చూడండి" అన్నాడు. తవ్వారు. లోతున పెద్ద పాతర కనిపించింది. ఎంతో ధనమున్నది. చక్రవర్తికి పూర్తిగా అర్థమై పోయింది. “నీ దేవుడు నా పాదాలక్రింద ఉన్నాడని" ఆ మనిషి ఆగ్రహంతో ఎందుకు కేక పెట్టాడో, తాను ఎటువంటి మహాభక్తున్ని సంహరింప జేసాడో తెలిసే సరికి, అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. 


పాప పరిహారార్థం తన మరణానంతరం తన దేహాన్ని ముక్కలు చేసి, ఒక్కో ముక్కను ఒక్కొక్క మహాపురుషుడి సమాధి వద్ద ఉంచమని, ఆ విధంగానైనా తనకు మనశ్శాంతి లభిస్తుందని వీలునామాలో వ్రాసిపోయాడని అంటారు. అందుకనే ఔరంగజేబు గోరీలకు ఏవిధమైన పై పూతలు రాతలు లేకుండా సాధారణమైనవిగా నెలకొల్పారట. మట్టితో నిర్మించిన ఈ నిరాడంబరమైన గోరీల వద్ద రోజ్మేరీ మొక్కను ఒకదాన్ని మాత్రం నాటారు.        

 ◆నిశ్శబ్ద

By
en-us Political News

  
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.