ఉపన్యాసకులు ఎలా ఉండాలి?

Publish Date:Nov 17, 2023

Advertisement

ఓ సభ నిండా శ్రోతలు ఉన్నప్పుడు వారి ముందు మాట్లాడటం, వారిని మెప్పించేలా మాట్లాడటం ఒక గొప్ప కళ. నేటి కాలంలో ఇలా మాట్లాడేవారు చాలా అరుదు. ఒకసారి చరిత్రలోకి చూస్తే……..

చికాగోలో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు సమయం ఇచ్చేందుకే ఎవ్వరూ ఇష్టపడలేదు. అయిష్టంగా, మొక్కుబడిగా సమయం కేటాయించారు. ఐతే ఆరంభ వాక్యాలతోనే వివేకానంద అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. సంక్లిష్టమైన, మతపరమైన ఉపన్యాసాల నడుమ శ్రోతలను "సోదరసోదరీమణులు" గా సంబోధించటంతోటే శ్రోతల పైమెట్టునున్న వాడిలా కాక, వారిలో తానూ ఒకడైపోయాడు. విశ్వవేదికపై వివేకానందుడు ఓ శక్తిగా అవిర్భవించాడు.

ఉపన్యాసాలిచ్చేవారు గమనించాల్సిన అంశం ఇది. వీలైనంత త్వరగా ఎదురుగా ఉన్న శ్రోతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. శ్రోతల కన్నా తాను ఒక మెట్టు పైనున్న వాడిలా కాక తానూ శ్రోతలలో ఒకడన్న భావనను శ్రోతలకు కలిగిస్తే తోటే ఉపన్యాసకుడు. సగం విజయం సాధించినట్టే.

ఆధునిక సమాజంలో 'వాజ్ పేయి' ఉపన్యాసాలంటే, సభల పేరు చెప్తే ఆమడ దూరం పారిపోయేవారు కూడా సభలకు పరుగెత్తి వస్తారు. ఇతర రాజకీయనాయకులంతా ఓ వైపు, ఉపన్యాసాలలో వాజ్ పేయి ఒక్కడూ ఓ వైపు. గమనిస్తే, వాజ్ పేయి ఉపన్యాసాలలో ఏ నాడూ తాను ఓ మెట్టు పైనున్నాడన్న భావన శ్రోతలకు కలగనివ్వడు. పైగా చమత్కార పూరితమైన సంభాషణలతో సభను అలరిస్తాడు. మామూలుగా మనం మాట్లాడే పదాలనే విరిచి పలకటం, వాటిని పలుకుతున్నప్పుడు తానూ ఆనందం అనుభవిస్తూ పలకటం, వల్ల వాజ్ పేయి మామూలు మాటలు కూడా సభలో ప్రేక్షకులను ఉర్రూతలూపుతాయి. పైగా, తన ఉపన్యాసంలో సమకాలీన సంఘటనలను, ప్రాంతీయఘటనలను వ్యంగ్యంగా ప్రస్తావించటంతో వాజ్ పేయి ఉపన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

వాజ్ పేయి తరువాత శ్రోతలను అంతగా అలరించేవి అబ్దుల్ కలామ్ ఉపన్యాసాలు. వాజ్ పేయి ధోరణికి, వాక్ శైలికి పూర్తిగా భిన్నమైంది అబ్దుల్ కలాం ధోరణి. అయితే ఇద్దరిలో మనం గమనించాల్సిన అంశం, వారు వీలైనంతగా శ్రోతలకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తగా తన ఇమేజీని వాడుకుంటూ, ప్రతి ఒక్కరికీ మంచిని బోధించాలన్న నిజాయితీని ప్రదర్శిస్తూ, అబ్దుల్ కలామ్ శ్రోతలను స్ఫూర్తిమంతం చేయగలుగుతున్నాడు. గమనిస్తే రాజకీయ సంబంధిత ఉపన్యాసాలిస్తున్నప్పుడు అబ్దుల్ కలామ్ వ్యవహారశైలి మొక్కుబడిగా ఉంటుంది. అదే పిల్లల నడుమ, విద్యార్థుల నడుమ ఆయన చైతన్యంతో ఉట్టిపడుతూ, చైతన్యాన్ని కలిగిస్తాడు. 

దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఉపన్యాసకుడు తనకు ఏ అంశాలపై పట్టు ఉందో, ఏ అంశంపై తాను శక్తిమంతంగా మాట్లాడగలడో తెలుసుకొని ఉండాలి. లేకపోతే వేదికనెక్కి అభాసుపాలు కాక తప్పదు. ప్రస్తుతం మన నాయకులనేకులకు తాము మాట్లాడాల్సిన అంశాలపై పట్టు ఉండదు. ఏదో రొటీన్ గా, మొక్కుబడిగా మాట్లాడతారు. దాంతో సభలంటేనే విసుగు పుడుతుంది. సాహిత్య సభలు కూడా ఇలాగే తయారయ్యాయి.

సాహిత్యసభలు తమ పూర్వవైభవాన్ని కోల్పోవటం వెనుక ఉపన్యాసకులలో నిజాయితీ లోపించటం ప్రధానకారణం. పొగడ్తలతో ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయటం, ఏ సభకు ఆ సభలోని వ్యక్తే కాళిదాసుకు పెద్దన్న అన్నట్టు మాట్లాడటం సర్వసాధారణమై పోయింది. విమర్శలు భరించే సహనం లేకపోవటంతో పొగడ్తలే దివ్యౌషధంగా మారాయి. దాంతో సాహిత్యసభలు విలువను కోల్పోయి పరిహాసాస్పదం అయ్యాయి.

సభల్లో మాట్లాడేటప్పుడు ఉపన్యాసకుడు ముందుగా తాను మాట్లాడే అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండటం తప్పనిసరి, చమత్కారపూరిత సంభాషణ లేకున్నా, విభిన్నభావాలు ప్రదర్శించలేకున్నా, శ్రోతల దృష్టిని నిజాయితీగా, విజ్ఞానవంతంగా ఉండే ఉపన్యాసకుడు ఆకర్షించగలుగుతాడు. ఇలాంటి ఉపన్యాసకులే ప్రజల మనసుల్లో కూడా అంతో ఇంతో గుర్తుగా నిలిచిపోతారు.

                                      ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
తల్లిదండ్రుల తో బంధం చిన్నతనం నుంచి ఉంటుంది.
 ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం.
నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి....
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.
ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు.
మూడు రోజుల కిందట భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది.
ఒక వ్యక్తి చాణక్య నీతి సూత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే అతను జీవితంలో ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తాడు.
కాశ్మీర్ అనేది కేవలం ఒక భూభాగం కాదు. చరిత్ర, జానపద కథలు,  సంస్కృతి  పొరలతో చుట్టబడిన పేరు.  
ఈ జనరేషన్ ను ఆల్ఫా యుగం అనవచ్చు. ఇది AI, స్మార్ట్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్,  సోషల్ మీడియా మధ్య పెరుగుతోంది.
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం.
వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం.
మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్‌లో ప్రతి రెండవ వ్యక్తి చెమటతో ఇబ్బంది పడుతుండటం గమనించవచ్చు. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చెమట వల్ల శరీరం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది....
పిల్లలకు ఒక వయసు రాగానే పుస్తకాలతో సావాసం మొదలవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.