తీరమైనా, సముద్రమైనా  మీ రక్షణకి మేమున్నాం....

Publish Date:Feb 1, 2025

Advertisement


ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలని పరిశీలిస్తే అవన్నీ  ఎగుమతులు, దిగుమతులు మీదనే ఆధారపడ్డాయని తెలుస్తుంది. మరి ఈ ఎగుమతులు, దిగుమతులు దేని మీద ఎక్కువ ఆధారపడ్డాయంటే దానికి  సమాధానం తీరప్రాంత ఓడరేవులు, సముద్ర మార్గాలనే  చెప్పాలి. మరి ఇంత ముఖ్యమైన తీరప్రాంతాన్ని, సముద్రాన్ని కాపాడటానికి రక్షకుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పొడవైన తీరప్రాంతం కలిగిన దేశాల్లో ఒకటైన  మన దేశ తీరాన్ని, మన సముద్ర సరిహద్దుని ఎల్లవేళలా కాపాడటానికి  మనకీ ఒక రక్షణ దళం ఉంది. అదే ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసిజి)....  ఈ ఐసిజి  స్థాపనను గౌరవిస్తూ,  వీరు సముద్ర భద్రత కోసం చేపట్టిన కీలక బాధ్యతలను గుర్తు చేసుకుంటూనే…  దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను రక్షించటం కోసం ఎన్నో  సాహసోపేతమైన పనులు చేస్తున్న కోస్ట్ గార్డుల  కృషిని గౌరవించేందుకు ప్రతీ సంవత్సరం  ఇండియన్ కోస్టుగార్డ్ డే జరుపుకుంటాము. 2025లో  ఐసిజి తన 49వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ  సంధర్భంగా మన కోస్ట్ గార్డ్ ప్రయాణం గురించి తెలుసుకుంటే…. 

ఇండియన్ కోస్టుగార్డ్(ఐసిజి)  ఎప్పుడు మొదలైంది....

 
ఫిబ్రవరి 1, 1977న తీర సంరక్షణ దళ చట్టం  చేయటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాపించబడింది. అయితే 1978లో  భారత పార్లమెంట్  దీన్ని ఆమోదించటంతో  అధికారిక గుర్తింపు లభించింది.  అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ సారథ్యంలో ఇండియన్ కోస్టుగార్డ్ ఏడు నౌకలతో అధికారికంగా స్థాపించబడింది. ఐసిజి  ఒక రక్షణ దళమే తప్ప మిలిటరీ విభాగం కాదు.  ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
దీని ప్రధాన కార్యలయం ఢిల్లీలో ఉంది.  ఐతే మొదట కేవలం ఏడు నౌకలతోనే  మొదలైన దీని ప్రయాణం ఇప్పుడు 158 నౌకలు, 78 విమానాలతో, సాంకేతిక పరికరాలతో శక్తివంతంగా మారి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కోస్ట్ గార్డుగా నిలిచింది. ఇది 2030 నాటికి 200 నౌకలు, 80 విమానాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.

ఇండియన్ కోస్టుగార్డ్  ఏం చేస్తుంది.....


ఈ దళం  నినాదం: “వయం రక్షామహ”,  అంటే దీనర్ధం “మేము రక్షిస్తాము” అని. ఈ మాట నిజం చేస్తూనే దాదాపు అర్ధ శతాబ్ధం నుంచి ఐసిజి మన తీరాన్ని, మనల్ని రక్షిస్తూ వస్తుంది.  సముద్ర ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు, ఆఫ్‌షోర్ టెర్మినల్స్, ఇతర నిర్మాణాల రక్షణ & భద్రతను చూసుకుంటుంది.  ఎల్లప్పుడూ భారత తీర రేఖను గస్తీ కాస్తూ, అక్రమ కార్యకలాపాలైన    స్మగ్లింగ్, సముద్ర దొంగతనాలు, ఇతర నేరాలను అరికడుతుంది. . తుఫాన్లు, సహజ విపత్తుల సమయంలో  సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులకు సహాయం అందించి రక్షిస్తుంది. సముద్ర  కాలుష్యం జరగకుండా  నియంత్రణ, నివారణ చర్యలు తీసుకుంటూ,   సముద్ర పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. అరుదైన సముద్ర జీవులను రక్షిస్తుంది. ఇది ఇండియన్ నేవీ,  మత్స్య శాఖ, కస్టమ్స్,  కేంద్ర-రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేస్తూ  అక్రమ రవాణా జరగకుండా ఆపుతుంది. భారత సముద్ర పరిధుల చట్టం  అమలు జరిగేలా చూస్తుంది. మన సముద్ర పరిధిలోకి ఇతర దేశాలవారు  అక్రమంగా రాకుండా నివారిస్తుంది. సముద్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సైంటిఫిక్  డేటాను సేకరించి, యుద్ధ  సమయాల్లో నౌకాదళానికి మద్దతు అందిస్తుంది. భారత సముద్ర జలాల్లో చమురు లీకేజీ జరిగితే, దాన్ని తొలగించడానికి మొదటగా ఇండియన్ కోస్టుగార్డ్ స్పందిస్తుంది.

ఇండియన్ కోస్టుగార్డ్ చేస్తున్న కృషిని గుర్తించాలి......

సముద్రంలో ఒక షిప్పులో ప్రయాణించటం అందరూ అనుకున్నంత సరదాగా ఏమీ ఉండదు. అదీ కాక దేశ రక్షణ కోసం పనిచేస్తున్న కోస్టల్ గార్డ్ షిప్పులో ఉన్నవారికి  అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ప్రయాణం. ప్రతీరోజు కొత్తగా, సాహసోపేతంగా ఉంటుంది. ఈ విశాల నీలి సముద్రంలో  పగలు, రాత్రి అని చూడకుండా అహర్నిశలు మన దేశ సముద్ర సరిహద్దులని గస్తీ కాస్తున్న కోస్ట్ గార్డుల జీవితం అంత సులభంగా ఉండదు.  సముద్రంలో చిన్న చిన్న దారి దోపిడీలు చేసే దొంగల చేతికి కూడా ఆధునిక మారణాయుధాలు  అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఒక కోస్టల్ గార్డ్  తన కర్తవ్యం నెరవేర్చటం ఎంత కఠినమో, ఎంత సాహసమో ఆలోచించాలి. 


భారతదేశ తీరప్రాంతంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.  సుమారు 7516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది కొత్త ఆధునిక సాంకేతిక లెక్కల ప్రకారం సుమారు 11000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పైగా మన భారతదేశం అనేక దేశాలకి దగ్గరగా ఉండటంతో పాటూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సంప్రదాయ సముద్ర వాణిజ్య మార్గం దగ్గరగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి బౌగోళిక పరిస్థితులున్న  మన దేశ తీరాన్ని, సముద్ర సరిహద్దులని కాపాడటంలో మన కోస్టుగార్డులు  ఎంతలా కృషి చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి.  ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సంధర్భంగా  ఎంతో సేవ చేసిన, చేస్తున్న మన రక్షకులకి సలాం!

                             *రూపశ్రీ.

By
en-us Political News

  
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో..
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.