ఆకాశమే హద్దుగా భారత వైమానిక దళం!

Publish Date:Oct 8, 2022

Advertisement

రక్షణ అనేది ప్రతి దేశానికి అవసరం. ప్రపంచంలో ఎన్నో దేశాలు రక్షణ పరంగా బలంగా ఉండటం వల్ల పక్కదేశం వాడు దాడి చేయకుండా ఉండగలుగుతున్నాడు. ఒకప్పటి కాలంలో రాజులు కోట రక్షణ కోసం, తమ రాజ్యాన్ని పక్క రాజ్యం వాడు దండెత్తి వచ్చి లాక్కోకుండా ఉండటం కోసం సైన్య బలాన్ని పెంచుకుంటూ ఉండేవారు. అయితే రాచరిక వ్యవస్థ పోయాక ఈ రక్షణ వ్యవస్థ క్రమంగా మరుగున పడింది. బ్రిటిషు వారి చేతుల్లో నలిగాక భారతదేశానికి రక్షణ వ్యవస్థ అవసరం మళ్ళీ తెలిసొచ్చింది. జల, వైమానిక, సైనిక దళాల వైపు అడుగులు పడిన కారణంగా నేడు భారతదేశ రక్షణ దళం ప్రపంచంలో పటిష్టమైనదిగా ఆవిర్భవించింది. అంతేకాదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది కూడా. 

అసలు ఎయిర్ ఫోర్స్ డే ఎలా ఏర్పడింది?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రాయల్ ఎయిర్ ఫోర్స్ గా పిలిచేవారు. ఇది ఏర్పడినప్పుడు దీనిలో కేవలం ఆరుమంది సభ్యులు, 19 మంది సైనికులు ఉన్నారు అనే విషయం విస్మయం కలిగించినా వీరి ప్రయాణం నేడు ఒక గొప్ప శక్తిగా మారిందంటే ఎంత కృషి చేసి ఉండాలో అర్థమవుతుంది. ఈ సభ్యుల దగ్గర నాలుగు వెస్ట్ ల్యాండ్ వ్యాపిటి IIA ఆర్మీ ప్లైన్ లు ఉండేవి. అప్పటికి ప్రపంచంలో ఇతర దేశాలలో డజన్ల కొద్దీ యుద్దవిమానాలు, ప్లైన్ లు ఉండేవి, వీటితో పోలిస్తే భారతదేశం దగ్గరున్నవి చాలా తక్కువ. అయినా భారతదేశం వాటిని అభివృద్ధి చేసుకోవడంలో సఫలం అయింది. 1936, 1938 సంవత్సరాలలో  వీటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి భారత వాయు దళం చాలా శక్తివంతగా రూపు మార్చుకుంది. 

1941 సంవత్సరం తరువాత శిక్షణా నిర్వహణలు ఎంతో వేగం పుంజుకున్నాయి. శిక్షణ కోసం క్లబ్ లు ఏర్పాటుచేయడం, యువ రక్తాన్ని ఈ వర్గంలో భాగస్వామ్యం చేయడం వంటి చర్యల వల్ల భారత వైమానికదళం పటిష్టత పొందింది.

1932 అక్టోబర్ 8 వ తేదీన స్థాపించబడిన భారత వైమానిక దళం ప్రస్తుతం 90 వ ఎయిర్ ఫోర్స్ డే సైలెబ్రేషన్ ని జరుపుకోబోతోంది. యుద్ధాలలోనూ, రక్షణ వ్యవస్థ తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించే వాయుదళం తన విజయాలను గుర్తుచేసుకుంటూ, అమరవీరులకు నివాళులు అర్పిస్తూ దేశమంతా చాటిచెబుతుంది. 

భారత వాయుదళం గురించి!

ప్రతి సంవత్సరం ఒక్కో చోట భారత వాయుదళం వేడుకలు జరపడం సాధారణం. 2022 సంవత్సరం అక్టోబర్ 8 న జరుగుతున్న ఈ వేడుకలకు చండీఘర్ వేదిక అయింది.

వాయు దళం తన బలాన్ని ప్రదర్శిస్తూ విన్యాసాలు చేస్తుంది. దీనికోసం ముందుగుగానే సన్నాహాలు చేస్తోంది, గొప్ప సాధన వీరి సొంతం కూడా.  ఆకాశంలో అద్భుతం చేసే ఈ విన్యాసాలు చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈసారి జరుగుతున్న  ఎయిర్ షోలో 83 విమానాలు పాల్గొంటాయి.  ఎయిర్ షోలో పాల్గొనే విమానంలో 44 యుద్ధ విమానాలు, 7 రవాణా విమానాలు, 20 హెలికాప్టర్లు ఇంకా 7 పాతకాలపు విమానాలు ఉన్నాయి.  అదే సమయంలో 9 విమానాలను సిద్ధంగా ఉంచుతారు. ఒకో సంవత్సరం ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈసారి ఎయిర్ షో ప్రత్యేకత ఏంటంటే.. కొత్త తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కూడా ఇందులో చేర్చనున్నారు.

ప్రతి వర్గానికి ఒక నినాదం అంటూ ఉంటుంది. అలాగే ప్రతి దేశానికి కూడా నినాదం ఉంటుంది. అలాగే భారత వాయుదళానికి కూడా ఓ నినాదముంది. ఈ నినాదం వెనుక ఒక ఆసక్తికర విషయముంది.

"నభః స్పృషం దీప్తమ్"  అనేది భారత వైమానిక దళం యొక్క నినాదం. ఇది గీతలోని పదకొండవ అధ్యాయం నుండి తీసుకోబడింది. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య ఉపదేశమే ఈ నినాదం వెనుక కారణం. ఈ నినాదంతోనే భారత వైమానిక దళం తన విధులను నిర్వహిస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ముఖ్యవిషయాలు!

భారత వైమానిక దళం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద వైమానిక దళం.  యుపిలోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దది.

IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం. భారత వైమానిక దళం వివిధ కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.  వీటిలో ఆపరేషన్ పూమలై, విజయ్, మేఘదూత్ మొదలైనవి ఉన్నాయి.

భారత వైమానిక దళం IAF ఐక్యరాజ్యసమితితో శాంతి పరిరక్షణ మిషన్లలో కూడా పనిచేస్తుంది.

భారత వైమానిక దళాన్ని గతంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పిలిచేవారు.  ఈ పేరు స్వాతంత్ర్యం వరకు ఉన్నప్పటికీ,  స్వాతంత్య్రానంతరం రాయల్ అనే పదాన్ని తొలగించారు.

IAFలో అధిక సంఖ్యలో మహిళా ఫైటర్ పైలట్లు, మహిళా నావిగేటర్లు, మహిళా అధికారులు ఉన్నారు, వీరు భారత వైమానిక దళానికి తమ సేవలను అందిస్తారు.  భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫ్లీట్‌లో కూడా మహిళా ఫైటర్ పైలట్ ఉన్నారు.

దేశంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారత వైమానిక దళం ఎల్లప్పుడూ సహాయక చర్యల్లో పాల్గొంటుంది.  వీటిలో గుజరాత్ తుఫాను(1998), సునామీ (2004), ఉత్తర భారతదేశంలోని వరదలు ఉన్నాయి.  అయితే, ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం ద్వారా IAF ప్రపంచ రికార్డు సృష్టించింది.  ఈ మిషన్‌కు 'రాహత్' అని పేరు పెట్టారు, ఈ సమయంలో భారత వైమానిక దళం దాదాపు 20,000 మందిని రక్షించింది.

ఇలా భారత వైమానిక దళం ఆకాశమే హద్దుగా ప్రపంచంలో గొప్పగా ఎదిగి దేశానికి అన్ని వేళల్లో నేనున్నానని భరోసా ఇస్తుంది. భారత వైమానిక దళానికి సెల్యూట్ చేయాలి మరి.


                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.