భారతదేశం అభివృద్ధి పేరుతో ముందుకెళుతుందా లేదా వెనక్కా?

Publish Date:Dec 9, 2022

Advertisement

అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం 131 వ స్థానంలో స్థానంలో ఉంది. ఇది 189 దేశాల పట్టికలో పొందిన స్థానం. సామాజిక, ఆర్థిక ఎదుగుదలలో భారతదేశం మిగిలిన దేశాలతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. అభివృద్ధి అంటూ ముందుకు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి బలహీనపడిపోతున్నట్టు ఎన్నో విషయాలు స్పష్టం చేస్తున్నాయి కూడా. ఇంతకూ మనం ముందుకు వెళుతున్నామా?? లేక వెనక్కు వెళుతున్నామా?? 

 సమాజంలో పెరుగుతున్న దాష్టీకాలు, దౌర్జన్యాలు గమనిస్తే మనం పాలరాతి యుగంలో ఉన్నామా! లేక పాత రాతి యుగంలోనే ఉన్నామా అనిపిస్తోంది. పొత్తిళ్ళలోనే బిడ్డల్ని గొంతు నులిమేస్తున్న కసాయి కన్నతల్లులు... ఎంతో మంది కనిపిస్తున్నారు. తమ జీవితాలు సంతోషంగా లేవని బిడ్డలను చంపి తాము చావడానికి సిద్ధపడుతున్న మహిళలు కోకొల్లలు. వీరు అమ్మ అనే పేరుకే మచ్చ తెస్తున్నారని అనిపిస్తుంది. 

వావివరసలు మరచి మగవారు జరుపుతున్న విశృంఖల ఘోరకృత్యాలు... చూస్తే అడవి మృగాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి.  మన ప్రవర్తన రోజురోజుకూ ఎందుకింత పతనావస్థకు చేరుకుంటోంది?? మనుషులుగా పుట్టిన అందరం క్రమంగా పశుప్రవృత్తిని పెంచుకుంటున్నాం అనే విషయం అక్కడక్కడా జరుగుతున్న సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. అందుకే స్వామి వివేకానంద అంటారు "పవిత్రత, మానవీయత లోపించి, ప్రాపంచికత మితిమీరిన రోజున, ఆ జాతికి అంత్యకాలం దాపురిస్తుంది. సమాచార విప్లవంతో పురోగమించామని సంబరపడుతున్నా, సదాచారం లోపిస్తే మాత్రం అది తిరోగమనమేనన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. సాంకేతికత, సంబంధిత విజ్ఞానం మన జీవన వ్యవహారాన్ని సులభతరం చేయవచ్చు; అంతమాత్రం చేత దానిని మన జీవనశైలిగా మలచుకుంటే దుష్ఫలితాలు అనంతం” అని. 

ఇది స్వామి వివేకానంద చెప్పిన నాటి నుండి నేటి వరకు కూడా సాగుతున్న వ్యవహారం.

లోపం ఎక్కడుంది?? వైఫల్యం ఎవరిది??

సమాజం గాడి తప్పుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతూనే ఉంది. మరి లోపం ఎక్కడో, వైఫల్యం ఎవరిదో అంతుచిక్కడం లేదు. ఆలోచిస్తే ఈ లోపం, వైఫల్యం ఒక్కరిది కాదు. ఇది మనందరిదీ! ప్రాథమిక స్థాయి నుంచి నేటి సమాజం మీట నొక్కితే వేగమే తప్పా వివేకం లేని మరమనుషులను తయారు చేస్తోంది. విద్యాలయాల నుంచి వ్యక్తిత్వం లోపిస్తున్న సాంకేతిక సాధనాల్లా ఈ తరం యువతీ యువకులు బయటి ప్రపంచానికి పరిచయమవుతున్నారు. వీరికి విచక్షణ, వివేకంతో పనిలేదు. కేవలం చెప్పింది అప్పజెప్పగలరు, అప్పగించిన పనిని చేసి చూపించగలరు. అంతే కాని తమకు తాము దేని మీదా ధారాళంగా ఏది చెప్పలేరు, అవగాహనతో చేయలేరు.  భారతదేశంలో విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకతతో కూడిన వారు పదిహేను శాతానికి మించి కూడా లేరనే ఓ వాస్తవం విస్మయపరుస్తుంది.

అంటే అభిరుచి, ఆసక్తి, స్వయం నిర్ణయం... ఇలా ఏవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇతరుల ప్రోద్బలం వల్లో, ఉపాధి లక్ష్యం వల్లో విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుంటున్నాం తప్ప అవగాహన, నైపుణ్యం  మొదలైనవాటి వల్ల కాదు. అలా అవగాహన లేకుండా అంత చదువులు చదివితే ఆ తరువాత పరిస్థితి అయోమయం, అగమ్యగోచరం. నేటికాలంలో జరుగుతున్నది అదే.. అందుకే మనం అభివృద్ధి పేరుతో ముందుకు వెళుతున్నామా లేక వెనక్కు వెళుతున్నామా అనే సందేహం వస్తుంది. నిజమా కాదా?? మీరూ ఆలోచించండి ఒకసారి.

                                      ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.