Publish Date:May 19, 2023
వీధికుక్కల దాడిలో తెలంగాణలో మరో బాలుడు మరణించాడు. ఖాజీ పేటలో ఆద మరచి నిద్రపోతున్న 8 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు అతిదారుణంగా దాడి చేసి చంపి వేసాయి. వీధికుక్కల దాడిలో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఈ బాలుడు చెట్టు క్రింద ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఈ దాడి జరిగింది. హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే క్వార్టర్స్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఉత్తర ప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన కూలీ కొడుకు చోటు కుక్కల దాడిలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. గత నెల తుర్కపల్లిలో దాదాపు 100 వీధికుక్కలు దాడి చేసి ఒక వ్యక్తిని చంపేసాయి. హైదరాబాద్ లో కూడా వీధికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన సంఘటన ఇంకా మరవక ముందే ఖాజీ పేటలో ఈ దాడి జరగడం కలచివేసింది. ఫిబ్రవరి 19న జరిగిన ఈ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
నాలుగేళ్ల బాలుడిని మూడు వీధి కుక్కలు దాడి చేసి చంపేసాయి. మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడిలో 70 మంది చనిపోయారు.
భారత్ లో వీధికుక్కల దాడిలో చనిపోయిన వారి సంఖ్య తీవ్రవాదుల చేతిలో చనిపోతున్న వారికంటే ఎక్కువేనని అంర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఒక అధ్యయనంలో వెల్లడించింది.
కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది అంటు వ్యాది. ఒక వేళ కుక్క కాటు వేస్తే రేబిస్ ను అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద నివారణా చర్యలు లేకపోవడం శోచనీయం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/increasing-street-dog-bites-39-155583.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.