Publish Date:Feb 12, 2026
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అదే పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులైతే అసలాయన బతికి ఉన్నారా? జైల్లోనే చంపేసి ఆ విషయం బయటపెట్టడం లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.
పాకిస్థాన్ జట్టును వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు.. అప్పట్లో అంటే ఆయన క్రికెట్ గా వెలుగొందుతున్న సమయంలో ఆయన స్టైలే వేరు. ఆయనకు దక్కిన గౌరవమే వేరు. జట్టు సభ్యులతో ఆయన ఫ్లైట్ లో ప్రయాణిస్తుంటూ.. ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఆడింది ఆట- పాడింది పాట అన్నట్లుగా ఉండేది. ఒక్క పాకిస్థాన్ మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు కూడా ఇమ్రాన్ స్టైల్ కి, బౌలింగ్ పేస్ కి ఫిదా అయ్యే వారు. ఇమ్రాన్ ఖాన్ కి పాక్ లోనే కాదు ప్రపంచ ఆటగాళ్లు కూడా అభిమానించేవారు. ఆరాధించేవారు.
ఆ తరువాత ఆయన రాజకీయరంగ ప్రవేశం చేశారు. పాకిస్థాన్ ప్రధాని కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఇమ్రాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇటీవల ఇమ్రాన్ పరిస్థితిని పరిశీలించేందుకు సుప్రీం పంపిన అమికస్ క్యూరికి ఇమ్రాన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. దాదాపు 80 శాతం కంటి చూపు కోల్పోయి, ఆరోగ్యం క్షీణించి తన పరిస్థితి అత్యంత దయనీకంగా ఉందని ఇమ్రాన్ అమికస్ క్యూరీకి చెప్పారు.
అప్పట్లో క్రికెట్ లో వెస్టిండీస్ ఆధిపత్యం తిరుగులేకుండా ఉండేది. 1983కు ముందు జరిగిన రెండు వన్డే వరల్డ్ కప్ టోర్నీలలోనూ విండీస్ విజేతగా నిలిచింది. క్రికెట్ లో ఆ దేశానికి ఎదురే లేదన్న పరిస్థితి ఉండేది. అలాంటి విండీస్ ఆధిపత్యాన్ని తొలుత 1983 వరల్డ్ కప్ లో భారత్ దెబ్బతీసింది. అప్పట్లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సారథి కపిల్ దేవ్. హర్యానా హరికేన్ గా అభిమానులు కపిల్ ను ఆరాధించేవారు. ఆ తరువాత సారిగా వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అ తరువాత 1992లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు వరల్ కప్ విజేతగా నిలిచింది. భారత్ కు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ ఎంత ప్రశాంతంగా, ఉత్సామంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. తన లెజండరీ హోదాతో ఎందరో క్రికెటర్లను తయారు చేశారు.
ఆనాడే కాదు ఈనాడు కూడా ఒక స్టైలిష్ బౌలింగ్ యాక్షన్ కి ఆయననే కేరాఫ్ గా చెబుతారు. అయితే కపిల్ దేవ్ రాజకీయా జోలికి రాలేదు. అందుకు భిన్నంగా ఇమ్రాన్ ఖాన్ తన క్రికెట్ ఇమేజీతో పాలిటిక్స్ లోకి ఎంటరై ప్రధాని స్థాయి దాకా ఎదిగారు. అయితే అధికారం కోల్పోయిన తరువాత అవినీతి ఆరోపణలలో చిక్కుకుని జైలు పాలై దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇమ్రాన్ కు వైద్యం అందించే విషయంలో పాక్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆదేశించాల్సిన పరిస్థితి రావడాన్ని బట్టే జైల్లో ఇమ్రాన్ ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అవగతమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/imrankhan-then-and-now-36-213981.html
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.