Publish Date:Sep 11, 2021
స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో హాస్పిటల్ లో చికత్స కొనసాగుతోంది. వైద్యులు ఔట్ ఆఫ్ డేంజర్ అని చెబుతున్నప్పటికి.. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. 48 గంటల పాటు సాయి ధరమ్ తేజ్ అబ్జర్వేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. సాయిధరమ్ తేజ పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. సాయిధరమ్ తేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్నీ అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు అక్కడే ఉన్నారు.
హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్కు గురికావడంతో ఆయన రైడ్ చేసిన వాహనంపై జనాల్లో చర్చ జరుగుతోంది. Sai Dharam Tej యాక్సిడెంట్ కాగానే వెంటనే ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఆయన నడిపిన బైక్ విజువల్స్ కూడా వచ్చాయి. తర్వాత సాయి ధరమ్ కేజ్ ప్రమాద విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. దీంతో చాలామంది ఆ బైక్ ఏమిటి? ఆ Bike Cost ఎంత ఉంటుంది, ఎంత speedగా వెళ్తుంది, ఎంత పవర్ ఉంటుంది, దాని ప్రత్యేకతలు ఏమిటి వంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
Sai Dharam Tej నడిపిన బైక్ కంపెనీ పేరు ట్రయంఫ్ (Triumph). సాయి ధరమ్ తేజ్ వాడుతున్న ట్రయంఫ్ బైక్ మోడల్ పేరు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ (Street Triple RS). Triumph Street Triple RS ధర రూ. 11,61,000 నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షో రూం ప్రైస్. యాక్సెసరీస్, రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపితే ధర ఇంకా పెరుగుతుంది.ఇది 765 సీసీ కెపాసిటీ బైక్. 6 గేర్లు ఉంటాయి. ఈ బైక్ బరువు 166 కేజీలు. ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ 17.4 లీటర్లు. ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 13 నుంచి 15 కిలోమీటర్లు వస్తుందని వాడేవారు చెబుతారు.
ట్రయంప్ మోటార్ సైకిల్స్ అనేది బ్రిటన్ కంపెనీ. బ్రిటన్లో మోటార్ సైకిళ్ల కంపెనీలలో ఇదే టాప్.ఇంగ్లాండ్లో కంటే థాయిలాండ్లో వీళ్లకు పెద్ద ప్రొడక్షన్ యూనిట్ ఉంది. ఇది సెలబ్రిటీ బైక్. ట్రయంఫ్ మోటార్ సైకిళ్లకు మాంచి క్రేజ్ ఉంది. చాలామంది సెలబ్రిటీల గ్యారేజ్లలో ఈ బైక్ కనిపిస్తుంది. అడ్వంచరిస్ట్ Bear Grylls, హాలీవుడ్ యాక్టర్లు David Beckham, Tom Cruise, George Clooney దగ్గర ట్రయంఫ్ బైక్లున్నాయి. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జామ్వాల్, జాన్ అబ్రహం టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ వద్ద కూడా ఈ బైక్ ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hero-sai-dharam-tej-sports-bike-triumph-special-25-122798.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.