Publish Date:Jan 17, 2025
లొట్టపీసు కేసు, లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, ఏసీబీ, ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయన్నది కేవలం పరిశీలకుల విశ్లేషణ మాత్రమే కాదు.. స్వయంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఈ ఫార్ములా కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయనకు ఇసుమంతైనా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.
ఆయనే కాదు.. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీలు వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసి అంతిమంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పైకి మాత్రం బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో పార్టీ తరఫున పిటిషన్ దాఖలుకు వెళ్లానని చెబుతున్నారు. ఆ పిటిషన్ల కోసమైతే షరీష్ రావు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున న్యాయవాదులు వెడితే సరిపోతుంది. కానీ ఆయన గురువారం (జనవరి 16) హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు.
అదే సమయంలో ఇక్కడ హైదరాబాద్ లో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఈడీ విచారిస్తోంది. దాదాపు ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను విచారించిన ఈడీ, అవసరమైతే మరోసారి పిలుస్తామంటూ విచారణ ముగించి పంపించింది. ఒక వైపు కేటీఆర్ ను విచారిస్తూనే ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించి ఆ తరువాత వైదొలగింది.ఆ కంపెనీ వైదొలగడం వల్లనే అందుకే ప్రభుత్వం స్పాన్సర్ షిప్ సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ2, ఏ3 అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఈడీ వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుండటమే కాకుండా, గ్రీన్ కో అనుబంధ ఏస్ నెక్స్ట జెన్ లావాదేవీలపై కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే ఏ2, ఏ3లు తమ వాంగ్మూలాలలో మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దీంతో అరెస్టు నుంచి కేటీఆర్ బయట పడేందుకు ఉన్న మార్గాలపై న్యాయనిపుణులతో చర్చించేందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంలో పిటిషన్ సాకుతో హరీష్ రావు హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harishrao-in-delhi-for-ktr-39-191390.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.