Publish Date:Feb 17, 2026
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి .. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం పెను సంచలనం సృష్టించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు కనిపించింది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా ఇస్నాపూర్ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్గా మోటే సుమలత.. వైస్ ఛైర్మన్గా పట్లోళ్ల మాధవి ఎన్నిక అయ్యారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న గూడెం మహిపాల్ రెడ్డి.. ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతలను ఉద్దేశించి పరోక్షంగా .బుల్లెట్ దిగిందా, లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 10 వార్డులు, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. వారిలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా మరొకరు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 13 ఓట్లు చేరాయి. దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gudem-mahipalreddy-shows-strength-in-patancheru-segment-39-214201.html
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.