ములుగు బిఆర్ఎస్ లో ముఠా తగాదాలు?!

Publish Date:Jul 3, 2025

Advertisement

ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ  జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో  బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.  పార్టీని జిల్లాలో బలోపేతం చేయాల్సిన వ్యక్తే పార్టీ పట్టు కోల్పోయి బలహీనపడడానికి కారకుడిగా మారుతున్నారంటూ పార్టీ వర్గాలే  బాహాటంగా చెబుతున్నాయి.  పార్టీ  శ్రేణుల సమాచారం మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వస్తుండటమే కాకుండా.. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్ కు సహకరించవద్దంటూ పార్టీ క్యాడర్ కు హుకుం జారీ చేశారు. దీంతో  నియోజకవర్గ ఇన్చార్జి కేవలం ఒక్క మండలానికే పరిమితమైన పరిస్థితి.

 దీంతో ములుగు బిఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం లో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు. ములుగు జిల్లా లో ఒకే నియోజకవర్గం ఉండటం అదీ ఎస్టీ   నియోజకవర్గం.  ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన జడ్పీ చైర్మన్ మాజీ  బడే నాగజ్యోతి కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి బంధువు అయిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా కాకులమారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది.  గత ఎన్నికల్లో  ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  సీతక్క బరిలో నిలవడం.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీచడంతో ములుగు నుంచి పోటీచేసిన జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆమే నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు.   

అయితే ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన కాకులమారి లక్ష్మీ నరసింహారావు తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఒక దశలో ఆయనను పార్టీకి దూరంగా పెట్టడం కూడా జరిగింది.  అయితే  ఆ తరువాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు లాబీయింగ్ తో పార్టీ ఆయనను ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని అంటారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కాకులమారి లక్ష్మీనరసింహరావు తన ఒంటెద్దు పోకడలతో  పార్టీ బలహీనం కావడానికి కారకుడౌతున్నారని అంటున్నారు. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్  నాగజ్యోతితో విభేదాల కారణంగా  జిల్లా పార్టీ గ్రూపు రాజకీయాలకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి.  

గత ఎన్నికలలో పార్టీ  పరాజయం పాలై అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన నేపథ్యంలో.. సమైక్యంగా ఉండి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలో కూడా ములుగు జిల్లాలో పార్టీ గ్రూపు రాజకీయాలతో కూనారిల్లుతోందన్న ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది.  ములుగు జిల్లా అధ్యక్షుడిగా స్థానికంగా ఉండాల్సినకాకులమారి లక్ష్మీనరసింహరావు హైదరాబాద్ లో ఉంటూ అడపాదడపా అతిథిగా జిల్లాకు వస్తున్నారనీ, ఆయన అందుబాటులో లేకపోవడమే కాకుండా.. జిల్లాలో పార్టీ కార్యక్రమాలేవీ తాను లేకుండా జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారనీ, మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ చార్జి నాగజ్యోతికి సహకరించొద్దంటూ శ్రేణులకు హుకుం జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  దీంతో బడే నాగజ్యోతి పేరుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ అయినా కేవలం తన సొంత మండలం తాడ్వాయికే పరిమితమైన పరిస్థితి.  

 కాకులమారి లక్ష్మీనరసింహరావుకు మంత్రి సీతక్కతో సత్సంబంధాలు ఉండటం,  పారిశ్రామిక వేత్తగా ప్రభుత్వంతో అవసరాల దృష్ట్యా అధికార పార్టీకి వ్యతిరేకంగా పన్నెత్తి మాట్లాడటం లేదనీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై  పోరాటాలకు వెనుకంజ వేస్తున్నారనీ, మొత్తంగా ఆయన సీతక్కకు విధేయుడిగా ఉంటున్నారనీ  టీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ములుగు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి కారణం జిల్లా అధ్యక్షుడి ఒంటెత్తుపోకడలేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

 నాగజ్యోతికి ప్రజాబలం లేదు అని అధిష్టానం దగ్గర నిరూపించి, ఆమె స్థానంలో తన అనుచరుడిని తీసుకురావాలన్న యోచనతో కాకులమారి లక్ష్మీనరసింహరావు పని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం ములుగు జిల్లాపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
జమ్మూ కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. కిష్త్వార్ ప్రాంతంలో భారీ వరదలో 12 మంది భక్తులు కొట్టుకుపోయి మరణించారు.
జగన్ అడ్డాపై టిడిపి జెండా ఎగిరింది. అదీ మామూలుగా కాదు. కనీవినీ ఎరుగని రీతిలో. కడప ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయాన్ని మూడు దశాబ్దాల తరువాత చరిత్రను తిరగరాయడంగా అభివర్ణించారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే మీరు అసలు అసెంబ్లీకి వస్తారో రారో క్లారిటీ ఇవ్వండంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? రారా క్లారిటీ ఇవ్వాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండి పడ్డారు.
మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మ‌ణి బుధవారం పర్యటించారు.
పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు.
అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది.
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి 6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా అధికారులు జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.