Publish Date:Jul 21, 2020
ఇంట్లో తయారుచేసుకుంటేనే బెటర్
కేంద్ర ఆరోగ్య శాఖ సూచన
కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి అది ఎన్-95 మాత్రమే అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు కవాటం ఉన్న ఆ మాస్క్ లు సురక్షితం కాదు అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్. వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, కరోనా పాజిటివ్ వ్యక్తులు వీటిని ఉపయోగించినప్పుడు కవాటం వల్ల వైరస్ బయటకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సమయంలో ఈ మాస్క్ వాడటం వల్ల వైరస్ ఇరతులకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయితే కవాటం ఉన్న మాస్క్ లు కాకుండా సాధారణ మాస్కులు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
కవాటం ఉంటే..
ఎన్ - 95 కవాటాలున్న మాస్క్ వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అయితే వదిలిన గాలిని మాత్రం శుద్ధి చేయకుండా నేరుగా వాతావరణంలోకి పంపిస్తుంది. కరోనా ఉన్న వ్యక్తులు వీటిని ధరించినప్పుడు వారు వదిలే గాలి ద్వారా వైరస్ వాతావరణంలోకి చేరుతుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేసిన తరుణంలో ఈ మాస్క్ ల వాడకంపై చాలా దేశాలు నిషేధం విధించాయి. వదిలేసిన గాలిని నేరుగా వాతావరణంలో కలిపేలా ఉంటే మాస్కులు ధరించి ప్రయోజనం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. క్లాత్ తో తయారు చేసిన మాస్క్ లను వాడటమే ఆరోగ్యకరమని సూచించింది. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అమెరికా దేశాలు వీటిని నిషేధించాయి. ఇంట్లో తయారు చేసిన మాస్కులనే వాడాలని మన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతిరోజూ...
ముక్కును, నోరును పూర్తిగా కవర్ చేసేలా క్లాత్ తో కుట్టిన మాస్క్ లు వాడటమే శ్రేయస్కరం. బయటకు వెళ్ళివచ్చిన తర్వాత
వేడి నీటిలో కనీసం ఐదు నిమిషాల పాటు నానపెట్టి శుభ్రంగా మాస్క్ ను ఉతకాలి. ఎండలో ఆరవేసిన తర్వాత తిరిగి వాడటం ఆరోగ్యకరం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరు వాడిన మాస్క్ లను మరోకరు వాడవద్దు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/government-warns-against-use-of-n95-masks-with-valves-39-101700.html
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.