Publish Date:Apr 23, 2022
తెలంగాణ గవర్నర్ తమిళిసై చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయా? లేక ఆమె స్వయంగా వివాదాలను ఆహ్వానిస్తున్నారా తెలియడం లేదని పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె తాను వివాదాస్పదురాలిని కాననీ పదే పదే చెప్పుకుంటున్నా...ఒక దాని తరువాత ఒకటిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమె పీఆర్వోను నియమించుకున్న ఉదంతం మరో వివాదంగా మారింది. ఆమె తన పీఆర్వోగా నియమించుకున్న వ్యక్తి తమిళనాడు బీజేపీ పీఆర్వో కావడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై తన ప్రజా సంబంధాల అధికారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. సదరు వ్యక్తి తమిళనాడు బీజేపీకి పీఆర్వ్వోగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఇప్పటికే తమిళిసై పై, ఆమె వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న తెరాస విమర్శలపర్వానికి తెర తీశారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్, రాష్ట్రంలో తల్లీ కుమారుడి ఆత్మహత్య వంటి అంశాలపై ఆమె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసి వ్యాఖ్యలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వం- రాజ్ భవన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో తమిళిసై పీఆర్వో వ్యవహారం వెలుగులోకి రావడంతో విమర్శలకు తెరాసకుపదునైన ఆయుధం దొరికినట్లైంది.
సాంకేతికంగా గవర్నర్ తమిళిసై పీఆర్వో బీజేపీకి చెందిన వ్యక్తి అవ్వడం నిబంధనలకు వ్యతిరేకం కాకపోయినప్పటికీ, నైతికంగా పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని అటువంటి విధులలో చేర్చుకోవడం విధాయకమని పరిశీలకులు అంటున్నారు. అయితే తెరాసతో గవర్నర్ సంబంధాలు ఉప్పు-నిప్పుగా మారిన తరుణంలో తమిళిసై సహజంగానే సాంకేతిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అశం నుంచి....మెడికల్ సీట్ల కేటాయింపు వరకూ, నియామకాల నుంచి నీటి వరకూ ప్రతి అంశంపైనా ఆరా తీస్తున్నారు. ప్రతి అంశంపైనా తనదైన శైలలో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆ అభిప్రాయాలన్నీ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగానే ఉంటున్నాయి.
త్వరలోనే రాష్ట్ర గవర్నర్ మార్పు ఉంటుందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తలు ప్రచారంలోనికి వచ్చిన తరువాత తమిళిసై తన దూకుడును మరింత పెంచారు. రానున్న రోజులలో తమిళిసై పీఆర్వో అంశం మరింతగా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్యా దూరం పెంచేందుకు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/governer-tamiisye-in-another-dispute-39-134837.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.